High Uric Acid : మీ వంటగదిలోని ఈ మసాలాతో.. యూరిక్ యాసిడ్ తగ్గుతుంది..!
చెడు జీవనశైలితో పాటు, తినడం, మందులు సరిగా తీసుకోవడం లేదా తగినంత నిద్ర లేకపోవడం కూడా యూరిక్ యాసిడ్ యొక్క వివిధ సమస్యలకు దారి తీస్తుంది. నొప్పి మాత్రమే కాదు, కిడ్నీ యొక్క పన్నెండవ ఐదు రింగులు కూడా యూరిక్ యాసిడ్ యొక్క సాధారణ స్థాయిలు పురుషులకు 2.5 నుండి 7.0 mg , స్త్రీలలో 1.5 నుండి 6.0 వరకు ఉంటాయి. కానీ ఈ స్థాయి ఎక్కువగా ఉంటే కిడ్నీ సమస్యలు రావచ్చు శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగినప్పుడు, చాలా సమస్యలు కనిపిస్తాయి . ముడులలో నొప్పి, నొప్పులు, నొప్పులు శరీరాన్ని చుట్టుముట్టాయి నియంత్రిత ఆహారం, నియంత్రిత జీవనశైలితో పాటు వంటగదిలో ఈ నల్ల మసాలా తీసుకోవడం ద్వారా యూరిక్ యాసిడ్ కు చెక్ పెట్టొచ్చు. నల్ల మిరియాలు వంటగదిలో నల్ల మసాలా ఇది శరీరం నుండి యూరిక్ యాసిడ్ను ఫిల్టర్ చేస్తుంది శరీరాన్ని ఫిట్గా బిగుతుగా ఉంచుతుంది . పెప్పర్లో పైపెరిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి, ఇవి శరీరంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అదే సమయంలో, పురుషాంగంలో నొప్పిని తగ్గించడం ద్వారా యూరిక్ యాసిడ్ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది నొప్పి నుండి సాధారణ ఉపశమనం ఇస్తుంది . మిరియాలలో శరీరంలోని టాక్సిన్స్ ను చాలా తేలికగా తొలగించే మూత్రవిసర్జన లక్షణాలు ఉంటాయి శరీరంలోని హానికరమైన పదార్థాలను బయటకు లాగుతుంది. రక్త ప్రసరణ ప్రక్రియను సరిగ్గా ఉంచడం, మీరు మిరియాలు తీసుకుంటే రక్తం ఫిల్టర్ అవుతుంది శరీరం నిండుగా ఉంది . మిరియాల ముద్దను ఉదయం ఖాళీ కడుపుతో తాగవచ్చు ఒక కప్పు నీళ్లలో చిటికెడు మిరియాల పొడిని కలిపి మరిగించి, చల్లారాక వడకట్టి సేవించాలి. అలాగే మిరియాలతో తేనె కలిపి తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, జలుబు, దగ్గు సమస్య వెంటనే తొలగిపోతుంది. అలాగే మిరియాలతో తేనె కలిపి తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, జలుబు, దగ్గు సమస్య వెంటనే తొలగిపోతుంది. న్యూస్ 18 తెలుగు పై విషయాలను అంగీకరించడానికి బాధ్యత వహించదు లేదా అభ్యర్థించదు ప్రాక్టికల్ అప్లికేషన్ ముందు డాక్టర్ సలహా అవసరం .
2024-06-30T05:42:36Z
పెళ్లిలో వచ్చే బంగారంపై హక్కు ఎవరికి ఉంటుంది? విడాకుల తర్వాత ఈ ఆస్తి ఎవరికి దక్కుతుంది?
హిందూ సంప్రదాయంలో పెళ్లిలో కట్న, కానుకలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. బంగారంతో పాటు స్థిరాస్తులు, బంగారం, వివిధ రకాల వస్తువులను స్త్రీధాన్ కింద ఇస్తుంటారు. నూతన వధూవరులు వేరు కాపురం పెట్టిన తరువాత ఈ వస్తువులు, గిఫ్ట్లను తమ వెంట తీసుకెళ్తారు. పెళ్లయిన తర్వాత కూడా అమ్మాయి పేరెంట్స్ కొన్ని బహుమతులు ఇస్తుంటారు. అయితే ఈ వస్తువులపై ఎవరికి పూర్తి హక్కు ఉంటుందనే డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా? స్త్రీధాన్ కింద వచ్చిన సామగ్రి, బంగారం ఎవరికి చెందుతుంది? చట్టాలు ఏం చెబుతున్నాయి? అనే విషయాలను తెలుసుకుందాం. పెళ్లి తర్వాత నూతన దంపతులు కలిసి కాపురం పెడతారు. పెళ్లిలో వచ్చిన గిఫ్ట్లు, కట్న, కానుకలు అన్నింటినీ తమ వద్దే ఉంచుకుంటారు. ఇద్దరు బాధ్యతలు షేర్ చేసుకుంటూ హాయిగా జీవితం గడుపుతారు. నీది, నాది అన్న తారతమ్యం లేకుండా సంసారాన్ని నడుపుతారు. అయితే, కలిసి ఉన్నంత కాలం ప్రాపర్టీ హక్కులపై ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ, విడిపోతేనే అసలు చిక్కు మొదలవుతుంది. చట్టానికి లోబడి విడిపోయే వారికి ఆయా ప్రాపర్టీలలో షేర్ పొందే హక్కు ఉంటుంది. ఇద్దరూ కలిసి సంపాదించిన ఆస్తిపై సమాన వాటా దక్కుతుంది. కానీ, స్త్రీధాన్ కింద పెట్టిన సామగ్రిపై దంపతులకు సమానమైన హక్కులు ఉండవు. జాయింట్ ఓనర్షిప్ ఉండదు!చాలా మంది భాగస్వాములు స్త్రీధాన్ కింద వచ్చిన ప్రాపర్టీలను జాయింట్ ప్రాపర్టీగా భావిస్తారు. కానీ వీటిలో తమకు కూడా 50 శాతం వాటా ఉంటుందని భర్తలు క్లెయిమ్ చేస్తుంటారు. అయితే, ఈ ప్రాపర్టీలపై చట్టంలో జాయింట్ ఓనర్షిప్కు సంబంధించిన ఎలాంటి నిబంధన లేదు. బంగారం, స్థిరాస్తి, వస్తువులు, గిఫ్ట్లతో పాటు ఏ సామగ్రి అయినా అది పెళ్లి కూతురుకే చెందుతుందని చట్టాలు చెబుతున్నాయి. ఈ ప్రాపర్టీలపై భర్తకు ఎలాంటి హక్కు ఉండదు. విడాకుల అనంతరం భర్తలు వీటిపై ఎలాంటి వాటాను పొందలేరు. చట్టపరంగా విడిపోయే ముందు మహిళలు కొన్ని జాగ్రత్తలు పాటించాలని లీగల్ నిపుణులు సూచిస్తున్నారు. బంగారం, జ్యువెలరీ, గిఫ్ట్లు, ఆస్తి పత్రాలు, చరాస్తులు వంటి ఇతర విలువైన సామగ్రిని తమ ఆధీనంలోనే ఉంచుకుంటే మంచిదని చెబుతున్నారు. వీటిని ఒక సేఫ్ ప్లేసులో దాచుకోవాలని అడ్వైజ్ చేస్తున్నారు. స్త్రీధాన్, వరకట్నంకు మధ్య తేడా ఇదేస్త్రీధాన్కు, వరకట్నానికి తేడా ఉంది. పెళ్లికి ముందు, పెళ్లి సమయంలో, పెళ్లి తరువాత ఎప్పుడైనా స్త్రీధాన్ కింద గిఫ్ట్లు, ఆస్తులను తమ బిడ్డలకు తండ్రులు స్వతంత్రంగా ఇస్తుంటారు. వరకట్నం మాదిరిగా ఇందులో ఎలాంటి ఒత్తిడి ఉండదు. స్త్రీధాన్ కింద వస్తువులను ఇవ్వడం చట్ట విరుద్ధం కాదు. 1956, హిందు వారసత్వ(సవరణ) చట్టం ఇందుకు సమ్మతిస్తోంది. ఈ చట్టం ప్రకారం స్త్రీధాన్ కింద వచ్చిన ప్రతి వస్తువుపై ఆస్తి హక్కు మహిళకే ఉంటుంది. మరోవైపు, వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం చట్టపరంగా నేరం. వరకట్న నిషేధ చట్టం, 1961 కింద వరకట్నం ఇచ్చినవారు, తీసుకున్నవారు శిక్షార్హులు. వరకట్నం కింద పెట్టిన సామగ్రిపై మహిళకు ఎలాంటి హక్కు ఉండదు. అయితే, విడాకుల అనంతరం భర్త నుంచి భరణం కోరే హక్కు భార్యకు ఉంటుంది.
2024-07-02T02:19:39Z
ఈ యువకుడు చేసిన పని మీకు తెలిస్తే.. మీరు ఏమంటారో మరి !
చుట్టూ పరిసరాలు ప్రశాంతంగా, స్వచ్చతగా ఉంటేనే మనం ఆరోగ్యకరంగా ఉంటాం. ఇందుకు అందరు తమ తమ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసుకుంటుండాలి. పెద్ద మెుత్తంలో చెత్తను తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది సహకరిస్తుంటారు ఈ విషయంలో. మరి కొంతమంది పరిశుభ్రతపై అవగాహన ఉన్నా సరే.. నిర్లక్ష్య కారణంగా చెత్తను వాగుల్లో, వంకల్లో, కాలువల్లో వేస్తుంటారు. ఇలా చేయటం చాలా వరకు మనిషికి ముప్పునే సృష్టిస్తుందంటున్నారు నిపుణులు. అయితే ఇలా చెత్తను కుప్పలు కుప్పలుగా తెచ్చి... పెద్ద కాలువల్లో పడవేయడం చూసిన ఓ యువకుడు బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే క్లీన్ నాగావళి రివర్ కార్యక్రమం. శ్రీకాకుళంకు చెందిన జీవన్ రోజూ అమమ్మ ఇంటికి వెళ్ళి వచ్చేవారు. అయితే రోజూ నాగావళి బ్రిడ్జిని దాటి వెళ్ళాలి. అయితే అందరూ బండ్ల మీద వెళ్తూ... వెళ్తూ చెత్తను తెచ్చి పై నుండి విసిరేస్తున్నారు. దీనిని చూసిన జీవన మనసు కలిచివేసింది. అందరూ చూసే వారే గాని క్లీన్ చేసేవారు ఎవరు లేరనుకొన్న ఆ కుర్రాడు.. నేను ఎందుకు క్లీన్ చేయకూడదని భావించారు. దీనితో క్లీన్ నాగావళి రివర్ అని శ్రీకాకుళం సోషల్ మీడియలో నాగావళి నదిని వ్యర్ధాల నుంచి కాపాడుకోవాలని ట్యాగ్ లైన్ తో ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. కొద్దీ రోజులలోనే విశేష స్పందన లభించింది. తరువాత ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేశారు. సుమారు వంద మందికి పైగా తాము సైతం అంటూ.. సోషల్ మీడియా ద్వారా ముందడుగు వేశారు. జీవన్ ఆలోచనకు శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ , హెల్త్ ఆఫీసర్ లు సైతం సహకారం అందించారు. నెలలో రెండు ఆదివారాలు నిర్వహించిన క్లీన్ నాగావళి రివర్ కార్యక్రమం విజయవంతంగా వల్లేంటర్ల సహకారంతో జరిగిందని లోకల్ 18తో జీవన్ తెలిపారు.జీవన్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇచ్చిన పిలుపుమేరకు సిద్ధార్థ ప్రమోద్ నాయుడు , యోగేష్ నాయుడు ముందుకు రాగా... వారితో యశ్వంత్, ప్రశాంత్, మధు, హరికేష్, ప్రణీత్, దుష్యంత్ తోడు వచ్చారన్నారు. వీరి స్ఫూర్తిగా మరి కొంత మంది నది వద్దకు చేరుకోవడంతో ఆదివారం జరిగిన క్లీన్ నాగావళి రివర్ కార్యక్రమం విశేష స్పందన వచ్చిందని తెలిపారు. వీరి కృషికి మెచ్చి మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ కూడా స్పందించి సిబ్బందిని పంపించి నాగవల్లి నదిని శుభ్రం చేయడంలో తోడ్పడ్డారని చెప్పారు. శ్రీకాకుళం నగర ప్రజలకు జీవనాధారమైన నాగావళి నదిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉందన్నారు క్లీన్ నాగవల్లి నది సభ్యులు. నదిలో పేరుకుపోతున్న చెత్తను తొలగించాలని ఉద్దేశంతో ప్రారంభమైన ఆలోచన కొనసాగిస్తూ క్లీన్స్ శ్రీకాకుళం అనే పేరుతో ఎక్కడైనా ఎటువంటి క్లీనింగ్ కార్యక్రమం నిర్వహిస్తే శ్రీకాకుళం మున్సిపాలిటీ తరుపున సహాయం అందిస్తామని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంకట రావు తెలిపారు. ఇకపై ప్రతి ఆదివారం క్లీన్ నాగావళి రివర్ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. నాగావళి నదిలో , కొటేశ్వరస్వామి గుడి దగ్గర గల బ్రిజ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా చెత్త వేయడం వలన ఈ కార్యక్రమం ఆప్రాంతంలో నిర్వహిస్తున్నామని జీవన్ చెప్పారు. ఈ కార్యక్రమం నిర్వహణకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ హెల్త్ ఆఫీసురు సిబ్బందికి ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణకు అవసరమైన సామాగ్రిని అందించిన దాతలకు అందరికీ కృతజ్ఞతలు చెప్పారు జీవన్.
2024-06-30T07:12:43Z
బీర్, విస్కీ, వోడ్కా, రమ్, వైన్.. వీటిలో ఏది ఎక్కువ కిక్కు ఇస్తుందో తెలుసా..?
మందు బాబులు వివిధ రకాల ఆల్కహాలిక్ డ్రింక్స్ తాగుతారు. కొందరు బీర్లు ఇష్టపడితే, మరికొందరు విస్కీ, ఇతర డ్రింక్స్ లైక్ చేస్తారు. వీటిలో ఇథనాల్ కంటెంట్ ఉంటుంది. అయితే బీర్, విస్కీ, వోడ్కా, రమ్, వైన్.. వీటిలో దేని స్పెషాలిటీ దానికే ఉంటుంది. రంగు, రుచి, వాసన, తయారుచేసే విధానం కూడా డిఫరెంట్గా ఉంటాయి. వీటి ఆల్కహాల్ కంటెంట్ సైతం వేర్వేరుగా ఉంటుంది. అయితే ఆల్కహాల్ పర్సంటేజ్ ప్రకారం చూస్తే, ఈ డ్రింక్స్లో ఏది తాగితే ఎక్కువ కిక్కు ఎక్కుతుందో తెలుసుకుందాం. బీర్ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది తాగే చిల్డ్ ఆల్కహాలిక్ డ్రింక్ ఇది. నీరు, హాప్స్, ఈస్ట్, బార్లీతో బీర్లు తయారు చేస్తారు. బార్లీ నుంచి షుగర్ తీసి, తర్వాత దాన్ని ఈస్ట్తో పులియబెడతారు. అయితే రైస్, గోధుమ, మొక్కజొన్నలతో కూడా ఈ డ్రింక్ను తయారు చేస్తారు. బీర్లలో 4-6 శాతం ఆల్కహాల్ ఉంటుంది. వైన్రెడ్, వైట్ వైన్ రెండింటిలో ఆల్కహాల్ కంటెంట్ 5.5 శాతం నుంచి 25 శాతం వరకు ఉంటుంది. సాధారణంగా వైన్ టేస్ట్ కొంచెం స్వీట్గా ఉంటుంది. ఎరుపు లేదా నలుపు రంగు ద్రాక్ష పండ్లను పులియబెట్టి రెడ్ వైన్ తయారు చేస్తారు. ఈ పండ్ల రసం తీసి పులియబెడతారు. రమ్రమ్లో కూడా ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది. ఇది చెరకు రసం తీసిన తర్వాత మిగిలే బైప్రొడక్ట్స్ను డిస్టిల్ చేసి దీన్ని తయారు చేస్తారు. అయితే ఈ డ్రింక్కు ముదురు రంగు, స్పెషల్ ఫ్లేవర్ రావడానికి, దాన్ని కాల్చిన ఓక్ బారెల్స్లో మాగబెడతారు. అవసరమైతే మొలాసిస్, గ్రాన్యులేటెడ్ షుగర్ లేదా పంచదార పాకం కూడా యాడ్ చేస్తారు. రమ్లో 40 శాతం ఆల్కహాల్ ఉంటుంది. విస్కీవిస్కీ ఒక డిస్టిల్డ్ డ్రింక్. బార్లీ, గోధుమలు, మొక్కజొన్నలను పులియబెట్టి దీన్ని తయారు చేస్తారు. సాధారణంగా స్పెషల్ ఫేవర్ కోసం కాల్చిన తెల్లటి ఓక్ కలపతో చేసిన బ్యారెల్స్లో విస్కీని పులియబెడతారు. దీంట్లో 40-50 శాతం ఆల్కహాల్ ఉంటుంది. వోడ్కాసాధారణంగా బంగాళదుంపలు లేదా తృణధాన్యాలను పులియబెట్టి వోడ్కా తయారు చేస్తారు. స్టార్చ్, జొన్న, మొక్కజొన్న లేదా గోధుమలతో కూడా ఈ డ్రింక్ తయారు చేయవచ్చు. కొన్ని కంపెనీలు పండ్లు, మొలాసిస్ నుంచి వోడ్కా తయారు చేస్తాయి. ఈ డ్రింక్లో 60 శాతం ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది. ఇది వాటర్ ఉన్నట్లే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. కాక్టెయిల్స్ మిక్సింగ్లో వోడ్కాను ఎక్కువగా వాడతారు. అయితే ఆల్కహాల్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండటం వల్ల, ఈ డ్రింక్ తాగితే త్వరగా మత్తు ఎక్కుతుంది.
2024-07-02T08:35:55Z
జూలై నెలలో శుభ ముహూర్తాలు ఇవే.. వివాహానికి, ముఖ్యమైన కార్యాలకు అనుకూలమైన రోజులు..
జూన్ నెల అయిపోయింది. ఇక జూలై నెలలోకి అడుగు పెట్టేశాం ఈ క్రమంలో ఈ నెల లేదా జూలై 2024లో శుభ ముహూర్తాలు ఏంటివి? వివాహానికి అనుకూలమైన రోజులు ఏవి ఉన్నాయి? వంటి అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్ పంచాంగ్ ప్రకారం.. రథయాత్ర నుండి గురు పూర్ణిమ వరకు, ఈ నెల కార్యక్రమాలు, పండుగలతో నిండి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జూలై నెల ఖగోళ, పౌరాణిక పరంగా ముఖ్యమైనదని నమ్ముతారు. జూలై 2024 త్వరలో ప్రారంభం కానుండడంతో, ఈ నెలకు సంబంధించిన అన్ని శుభ ముహూర్తాల జాబితాను చూద్దాం. యోగిని ఏకాదశి - మంగళవారం, జూలై 2. శుభ్ ముహ్రత్ - జూలై 2 ఉదయం 5:27 నుండి జూలై 3 ఉదయం 08:14 వరకు. రోహిణి వ్రతం - బుధవారం, జూలై 3. అమావాస్య - శుక్రవారం, జూలై 5. గుప్త నవరాత్రి ప్రారంభ తేదీ - శనివారం, జూలై 6. ఘటస్థాపనకు శుభ ముహూర్తం - జూలై 6, 2024న ఉదయం 5:28 నుండి 10:06 వరకు. పూరీ జగన్నాథ రథయాత్ర, చంద్ర దర్శనం - ఆదివారం, జూలై 7. శుభ ముహూర్తం - యాత్ర జూలై 07న ఉదయం 04:26 గంటలకు ప్రారంభమై జూలై 08, 2024 ఉదయం 04:59 గంటలకు ముగుస్తుంది. వరద చతుర్థి - మంగళవారం, జూలై 9, 2024. కుమార్ షష్ఠి - మంగళవారం, జూలై 11. దుర్గాష్టమి ఉపవాసం - ఆదివారం, జూలై 14. కర్క్ సంక్రాంతి - మంగళవారం, జూలై 16. ఆషాఢి ఏకాదశి, అశురా (దేవశ్యాని ఏకాదశి) రోజున - బుధవారం, జూలై 17. శుభ ముహూర్తం - జూలై 16 మధ్యాహ్నం 12:03 నుండి జూలై 17 మధ్యాహ్నం 12:32 వరకు. జయ పార్వతి ఉపవాసం ప్రారంభం, ప్రదోష ఉపవాసం - శుక్రవారం, జూలై 19. గురు పూర్ణిమ - ఆదివారం, జూలై 21. కన్వర్ యాత్ర - సోమవారం, జూలై 22. జయ పార్వతి ఉపవాసం ముగుస్తుంది - బుధవారం, జూలై 24. కాలాష్టమి - ఆదివారం, జూలై 28. కామికా ఏకాదశి - బుధవారం, జూలై 31. జూలై 2024లో గ్రహ సంచారాలు చూస్తే.. వృషభ రాశిలో కుజుడు, బృహస్పతి కలయిక - జూలై 13, 2024 - జూలై 26, 2024. కర్కాటకంలో సూర్య సంచారము - జూలై 16. చంద్ర సంచారము – జూలై 21. సింహ రాశిలో బుధ సంచారం - జూలై 19. కర్కాటకంలో శుక్ర సంచారం- జూలై 7. సింహరాశిలో శుక్ర సంచారం - జూలై 31. కుజుడు వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు - జూలై 12. జూలై 2024లో వివాహానికి అనుకూలమైన రోజులు పరిశీలిస్తే.. వివాహ వేడుకలు జూలై 9న పునఃప్రారంభించబడతాయి. జూలై నెలలో కొన్ని తిథిలు ఉన్నాయి. ఇవి వివాహాలకు శుభప్రదమని నమ్ముతారు. ఈ ఏడాది జూలై 11, 12, 13, 15 తేదీల్లో రానున్నాయి. అయితే జూలై 17న దేవశయని ఏకాదశి ఉండటంతో వివాహాలకు ఇది శుభదినం కాదు. (Disclaimer: ఈ ఆర్టికల్లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)
2024-06-28T08:09:44Z
Teeth: దంతాలు మిలమిల మెరవాలంటే.. ఈ ఇంటి చిట్కాలు పాటించండి చాలు
Health Tips:మనం మన మొత్తం ఆరోగ్యంపై చాలా శ్రద్ధ చూపుతాము, కానీ నోటి ఆరోగ్యం పరిశుభ్రత విషయంలో మనలో చాలామంది దానిని నిర్లక్ష్యం చేస్తాము. కానీ నోటి ఆరోగ్యం విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే నోటికి సంబంధించిన అనేక సమస్యలు వస్తాయి. దంతాలు పసుపు రంగులోకి మారడం, నోటి దుర్వాసన, దంత క్షయం, అంటే కావిటీస్, నల్లటి దంతాలలో నల్ల పురుగులు, పైయోరియా, దంతాలు , చిగుళ్ల నుండి రక్తస్రావం, దంతాల పైభాగంలో , వేర్లు పెరగడం వంటివి. సహజంగానే, ఏ రకమైన దంత సమస్యకైనా చికిత్స వేల రూపాయలు ఖర్చు అవుతుంది. మీరు మీ దంతాలను బలంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, మీరు ఈ క్రింది నివారణలను ప్రయత్నించాలి. మీ ఆహారపు అలవాట్లను మార్చుకోండి: ఒక నివేదిక ప్రకారం, ఆహారాన్ని మార్చుకోవడం ద్వారా దంత క్షయాన్ని నివారించవచ్చు. షుగర్ ఫుడ్స్ దంతక్షయాన్ని కలిగిస్తాయి, కాబట్టి చక్కెరను తీసుకోకూడదు. దంతాలు దృఢంగా ఉండాలంటే కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. పాలు, పెరుగు, పుల్లని క్రీమ్ చీజ్ వంటి పాల ఉత్పత్తులు తీసుకోవాలి. షుగర్-ఫ్రీ గమ్ నమలడం: షుగర్ లేని గమ్ నమలడం వల్ల కావిటీలను నివారించవచ్చు. ఇది నోరు దంతాలలో చిక్కుకున్న ఆహార కణాలను శుభ్రపరుస్తుంది . ఆమ్లాలను తటస్థీకరిస్తుంది. ఇది దంతాల ఎనామెల్ను బలపరుస్తుంది వ్యాధులతో పోరాడుతుంది. ప్రతిరోజూ టూత్ బ్రష్ను శుభ్రం చేయండి: టూత్ బ్రష్ ఉపయోగించిన తర్వాత, ఉడకబెట్టిన పులుసును నీటితో బాగా కడిగి ఆరనివ్వండి. బాత్రూమ్లో బ్రష్ను ఉంచవద్దు, ఎందుకంటే బ్రష్పై బ్యాక్టీరియా పేరుకుపోతుంది. దంత సంరక్షణ దినచర్యను అనుసరించండి: కావిటీస్ ఇతర దంతాల సంబంధిత సమస్యలను నివారించడానికి దంత సంరక్షణ దినచర్యను అనుసరించండి. ఉదయం సాయంత్రం పడుకునే ముందు పళ్ళు తోముకోవాలని పట్టుబట్టండి. మీరు మౌత్ వాష్ కూడా ఉపయోగించవచ్చు. రెగ్యులర్ చెకప్లను పొందండి: చాలా సార్లు, పళ్లను బాగా బ్రష్ చేసినప్పటికీ, నోటిలో కొంత మురికి ఉంటుంది. ఫలకం లేదా టార్టార్ తొలగించడానికి దంతవైద్యుని సహాయం తీసుకోండి. కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా డెంటిస్ట్ను కలిసి మీ దంతాలను చెక్ చేయించుకోండి. సప్లిమెంట్లు ,విటమిన్లు కూడా అవసరం: మంచి దంత ఆరోగ్యానికి విటమిన్లు అవసరం. తృణధాన్యాల ఆహారాలు తినండి. ఇందులో విటమిన్ బి ,ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అలాగే, ఇందులో మెగ్నీషియం ఉంటుంది, ఇది కాల్షియంను గ్రహించి మీ దంతాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
2024-07-01T01:30:59Z
శ్రీరాముడితో పాటు భరత శత్రుజ్ఞులు కొలువై ఉన్న ఏకైక దేవాలయం ఇదే
మన దేశంలో చాలా రామాలయాలు చూసి ఉంటాం, లేదా వాటి గురించి వినే ఉంటాం కానీ ఇక్కడ మనం చూసే రామాలయం అన్నిటితో పోల్చుకుంటే కొంత విభిన్నంగా ఉంటుంది. ఎందుకంటే మనకు రామాలయం అనగానే గుర్తుకొచ్చే దేవుళ్ళు రాముడు, సీత,లక్ష్మణుడు హనుమంతుడు, మాత్రమే గుర్తుకొస్తారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో దాదాపు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ రామాలయంలో రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, భరత శత్రజ్ఞులతో తోపాటు హనుమంతుడు, గరుగ్మంతుడు ఒకే రాయి పైన వెలవడడం ఈ ఆలయం ప్రత్యేకత. ఇక ఇదే విషయంపై ఆలయ పూజారి రామకృష్ణ చార్యులు లోకల్ 18 తో మాట్లాడుతూ..ఈ దేవాలయ అర్చకత్వం అనేది పూర్వీకుల నుండి వస్తుందని దాదాపు 70 సంవత్సరాల నుండి ఈ రాములవారికి మేము పూజలు చేస్తున్నామని,వారి పూర్వీకులు చెప్పిన ప్రకారం దాదాపు 300 సంవత్సరాల క్రితం ఆలయము, ఈ ఆలయంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా శ్రీరాముడు తన ముగ్గురు తమ్ముళ్ళతో స్వయంభుగా వెలిశాడు.. ఈ స్వామివారికి పూజలు అందించడం వారి వంశం పూర్వజన్మ సుకృతం అని గత డెబ్బై సంవత్సరాల నుండి స్వామివారికి వారే స్వయంగా నిత్య కైంకర్యాలు సమర్పిస్తున్నారని గ్రామ పెద్దల ఇతరుల దాతల ద్వారా దేవాలయానికి కొంచెం మరమ్మత్తులు చేయించారని ఈ స్వామి వారిని మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుస్తారని గ్రామ ప్రజలు ఏ శుభకార్యం చేయాలన్నా ఈ శ్రీరాముని దర్శించుకున్న తర్వాతే ఏ కార్యక్రమాన్నా మొదలు పెడతారని చెప్పారు. ఇది ఎంత పురాతనమైందో తెలుసుకోవడానికి పురావర్త శాఖ వాళ్ళు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ వారికి కూడా అంతుచిక్కలేదని ఈ దేవాలయంలో రాముడు లక్ష్మణుడు భరత శత్రజ్ఞులతో స్వయంభుగా వెలసిన దేవాలయం దేశంలోనే ఇదొక్కటే ఉందన్నారు.
2024-07-02T04:50:16Z