Trending:


పచ్చ కామెర్లు వచ్చాయని ఎలా గుర్తించాలి?

ఉదయం లేవగానే కొంతమంది హడావుడిగా ఇంటి పనులు చేస్తుంటారు. మరికొంతమంది అరచేతులను చూసుకుంటారు. వాస్తుశాస్త్రం ప్రకారం.. ఉదయం లేవగానే మూడింటిని మాత్రం అస్సలు చూడకూడదు. ఎందుకంటే ఇది మీకు సమస్యలను కలిగిస్తుంది. కామెర్లు అంటే రక్తంలో ఎక్కువ మొత్తంలో బిలిరుబిన్ ప్రసరించినప్పుడు వచ్చే వ్యాధి. కడుపు నొప్పి, జ్వరం, మూత్రం రంగు మారడం, మలం రంగు మారడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు పచ్చకామెర్ల వల్ల వస్తాయి. పచ్చ కామెర్ల వల్ల చర్మం, కళ్లు, గోర్లు పసుపు రంగులోకి...


Potals: ఈ సీజన్లో దొరికే పొటల్స్ కచ్చితంగా తినండి, చర్మం మెరిసిపోవడంతో పాటూ బరువు తగ్గుతారు

Potals: వేసవిలో దొరికే పొటల్స్ కూరగాయను అందరూ తినాల్సిందే. దీని రుచి కూడా అదిరిపోతుంది. పొటల్స్ వల్ల ఆరోగ్యానికి మ్యాజిక్ బెనిఫిట్స్ అందుతాయి.


Money Plant: మనీ ప్లాంట్ ఇంట్లో ఈ దిశలో ఏర్పాటు చేసుకుంటే ధనవర్షం ఖాయం!

Money Plant Vastu: సాధారణంగా మనీ ప్లాంట్ లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ఇష్టమే అయితే ఇంట్లో ఇది ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆ సుఖః సంతోషాలు ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది. ఇంకా ఇంట్లో ఆర్థిక లోటు అనేది కనిపించదు. ఇంట్లో ఆగ్నేయ మూలలో మనీ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆ ఇంటికి శుభం కలుగుతుంది.


చీరలో దివి వాద్య.. అందాల ఘుమఘుమలు!

దివి వాద్య చీరలో అందాల ఘుమఘుమలు పుట్టించింది.


Raw Mango Chutney: పచ్చిమామిడి పెసరపప్పు చట్నీ, స్పైసీగా చేసుకుంటే నోరూరిపోతుంది

Raw Mango Chutney: పచ్చి మామిడికాయతో రుచిగా చట్నీలు చేసుకోవచ్చు. ఒకసారి పెసరపప్పు పచ్చి మామిడి కలిపి చట్నీ చేసి చూడండి. టేస్ట్ అదిరిపోతుంది.


ఇలాంటి కళ్లు ఉన్న అమ్మాయిలని అస్సలు నమ్మకూడదంట.. ఎందుకంటే..!

స్త్రీ, పురుషులకు సంబంధించిన చాలా విషయాలు.. పలు గ్రంథాలలో ఉన్నాయి. ఒక స్త్రీ లేదా ఒక పురుషుడు ఎలాంటి లక్షణాలను కలిగి ఉండాలి.. ఎలాంటి చెడు లక్షణాలకు దూరంగా ఉండాలో అందులో ఉన్నాయి. అమ్మాయిల విషయానికి వస్తే వారిలో ఉండే కొన్ని లక్షనాలు కుటుంబాలను నాశనం చేస్తాయని పండితులు అంటున్నారు. ముఖ్యంగా అమ్మాయిలో మీరు స్నేహం లేదా ప్రేమ కొనసాగించే ముందు.. ముఖ్యమైన నాలుగు లక్షణాల గురించి జాగ్రత్తగా తెలుసుకోవాలి. మరీ ముఖ్యంగా ఏ రకమైన స్త్రీలను పురుషులు నమ్మకూడదనే వివరాలు గ్రంథాలలో వివరించబడింది. ఇంతకీ ఆ నాలుగు రకాల స్త్రీలు ఎవరనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కొందరు అమ్మాయిలు కళ్లతో పురుషులను ఆకర్షిస్తూ ఉంటారు. ముఖ్యంగా కామ కోరికలు ఎక్కువగా ఉండే స్త్రీలు ఇతర మగాళ్లను తమ కళ్లతోనే ఆకర్షిస్తుంటారు. ఏదైనా కళ్లతో మాట్లాడేలా ఉంటారు. ఇతరుల వైపు ముఖ్యంగా పది మందిలో ఉన్నప్పుడూ వేరే వ్యక్తి వైపు చూసే మహిళలు.. తమ కుటుంబానికి ఎప్పుడైనా ద్రోహం చేసే అవకాశం ఉందంట. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్న మహిళలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మితిమీరిన కోరిక లేదా అత్యాశ ఉండే మహిళలు కుటుంబాన్ని, ఇంటిని నాశనం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అత్యాశ అంటే డబ్బు, ఆస్తులు లేదా సంపదపై అతిగా ఆసక్తి ఉన్న స్త్రీలను పొరపాటున కూడా నమ్మకూడదు. ఎందుకంటే చాలా అత్యాశగల స్త్రీలు తమ చిన్న కోరికను నెరవేర్చుకోవడానికి ఎవరినైనా త్వరగా మోసం చేస్తారు. అలాంటి వారి నుంచి మీరు దూరంగా ఉండటం ఉత్తమం. కొందరు మహిళలు నిరంతరం ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే తమ కుటుంబంలోని విషయాలు తమ భాగస్వామితో కాకుండా ఇతరులను షేర్ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా పరాయి మగాళ్లతో మాట్లాడుతుంటారు. అందుకే ఇలాంటి మహిళలను అస్సలు నమ్మకూడదు. సాధారణంగా మహిళలు ఎక్కువ సమయం ఇంట్లో ఉండేందుకు ఇష్టపడతారు. అయితే కొందరు మహిళలు ఇంట్లో కాకుండా ఎక్కువ సమయం బయట గడుపుతుంటారు. ఇలాంటి వారిని పొరపాటున కూడా నమ్మకూడదు. ఈ రకమైన మహిళలు తమను నమ్ముకున్న వారిని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉందంట. (గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.. న్యూస్ 18 తెలుగు దీనిని ధృవీకరించడం లేదు.)


తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయా?.. ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే మీరింక నిద్రపోరు..!

బ్రహ్మముహూర్తముగా చెప్పుకునే తెల్లవారుజామున 3 - 4 గంటలకు చాలా మందికి పీడకలలు వస్తుంటాయి . ఈ కలలు నిజమవుతాయా? అనే భయం చాలా మందిలో ఉంటుంది. వీటిపై ప్రముఖ జ్యోతిష్యుడు సంతోష్ కుమార్ షాకింగ్ నిజాలు వెల్లడించాడు. తెల్లవారు జామున కలలు వస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు. అది చాలా మంచి సమయం. నిజానికి ఈ సమయంలో ఏం చేసినా విజయం వరిస్తుందని జ్యోతిష్యం చెబుతోంది. అంతేకాకుండా ఈ సమయంలో మనం చాలా శక్తివంతగా, మన బ్రైన్ చాలా పాజిటివిటీతో ఉంటుందని చెబుతున్నారు. ఈ సమయంలో ఎదైనా పనిని చేయాలనుకుంటే అది ఖచ్చితంగా వర్కవుట్ అవుతుందని చెబుతున్నారు. జీవితంలో ఏదైనా మంచి కోసం తలపడే పనిని చేపట్టాలుకునుకుంటే ఈ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది మీకు 5 రెట్లు ప్రయోజనం ఇస్తుంది. అంతేకాకుండా ఈ సమయంలో వచ్చే అనేక కలలు నిజమవుతాయని కలల పుస్తకం చెబుతుంది. అంతేకాకుండా సానుకూల శక్తితో ముడిపడి ఉన్న ఈ కలలు చాలావరకు శాపగ్రస్తమైనవి. కాబట్టి ఈ సమయాల్లో వచ్చే కలలను జాగ్రత్తగా చూసుకోవాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. గమనిక: పైన ఇచ్చిన సమాచారం మొత్తం ఇంటర్నెట్ నుండి తీసుకోబడినది. దీన్ని న్యూస్ 18 తెలుగు ధృవీకరించలేదు.


రాగి పాత్రల్లోని నీరు తాగితే ఎన్నో లాభాలు!

మ‌న పురాత‌న కాలం నుంచి రాగి పాత్ర‌లో నీరు తాగితే మంచిది అని చెబుతుంటారు. రోజూ పొద్దున్నే రాగిపాత్ర‌లోని నీరు తాగ‌డం ద్వారా క‌లిగే లాభాల గురించి తెలుసుకుందాం.


నేరేడు పండ్లు కచ్చితంగా తినాల్సింది వీళ్లే..ఎందుకో తెలుసా?

వర్షాకాలంలో మనకు మార్కెట్లో నేరేడు పండ్లు విరివిగా లభిస్తూ ఉంటాయి. నేరేడు పండ్లను మనం ఇండియన్ బ్లాక్ బెర్రీ అని పిలుస్తూ ఉంటారు. నేరేడు పండ్ల రుచి అందరికీ విపరీతంగా నచ్చేస్తుంది. వీటిని షుగర్ పేషెంట్స్ ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే... షుగర్ పేషెంట్స్ కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. వీరికి మాత్రమే కాదు.. మరికొందరు కూడా కచ్చితంగా ఈ నేరేడు పండ్లను తమ డైట్ లో భాగం చేసుకోవాలట. ఎవరు ఈ పండ్లను కచ్చితంగా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం... నేరేడు పండ్లను...


White Tooth: ఈ 5 ఆహారాలు తింటే నేచురల్ గానే మీ పళ్లు ముత్యాలలా మెరిసిపోతాయి..

Fruits For Natural White Tooth: యాపిల్ లో చర్మానికి ఆరోగ్యకరం కాకుండా ఇది పంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో స్క్రబ్ చేసే గుణాలు ఉంటాయి. యాపిల్ లో మాలైక్ యాసిడ్ ఉంటుంది. ఇది 25 పేర్కొన్న పచ్చదనాన్ని, మరకలను తగ్గించి నేచురల్ లా పనిచేస్తుంది.


పిల్లలు దొంగతనాలు చేస్తున్నారా.. ఇలా మాన్పించండి..

చిన్న పిల్లలు అప్పుడప్పుడు ఇంట్లో కొన్ని దొంగతనాలు చేస్తుంటారు. అలాంటి పిల్లల్ని ఎలా ఆ అలవాటుని మాన్పించాలో తెలుసుకోండి.


Health Tips: కింద కూర్చొని భోజనం చేయడం మంచిదేనా? 99% మందికి ఈ నిజం తెలియదు!

మారుతున్న కాలాన్ని బట్టి భోజనం చేసే విధానం కూడా మారుతూ వస్తోంది. కొంతమంది సెల్ ఫోన్, టీవీ చూస్తూ సోఫా, కుర్చీలో కూర్చొని భోజనం చేస్తుంటారు. ఒకప్పుడు ఎక్కువ మంది నేల మీద కూర్చొని భోజనం చేసేవారు. ఇప్పుడు కొందరు మాత్రమే దీన్ని అనుసరిస్తున్నారు. నిజానికి నేల మీద కూర్చొని భోజనం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. భోజనం తినడానికి ముందుకు వంగినప్పుడు పొట్ట కండరాలు చురుగ్గా పనిచేసి పొట్టలో ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. దీని వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడి కొవ్వు తగ్గుతుంది. కింద కూర్చొని తినడం వల్ల గుండెపై ఒత్తిడి తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.. వెన్నెముక నిటారుగా ఉంటుంది. కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గడంతో పాటు శరీరం అంతా రక్తప్రసరణ జరుగుతుంది.


మీరు ఇక్కడికి వెళ్లారో.. నాటి రోజులు గుర్తుకు రావాల్సిందే !

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ కి ప్రతి ఒక్కరూ మానసిక స్వాంతన కొరకు ప్రకృతిని ఆస్వాదించడం అలవాటుగా మారింది. ఇలా ప్రకృతిని ఆస్వాదించే వారి కోసం నగరాలు, పట్టణాలలో పార్కులు ఏర్పాటు చేశారు. అయితే పలు పార్కులు పచ్చదనాన్ని నిండుగా కలిగి ఉంటే.. పలు పార్కులు ఆహ్లాదకర వాతావరణంతో పాటు దేశభక్తిని పెంపొందిస్తున్నాయి. ఇలా ప్రకృతి అందాన్ని పెంచడమే కాక, దేశభక్తిని చాటి చెబుతున్న పార్క్ శ్రీకాకుళంలో ఉంది.స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ యువతలో దేశభక్తిని...


Ambani's wedding: ‘మామేరు’ సంప్రదాయ వేడుకలో మెరిసిపోయిన అంబానీల పెళ్లికూతురు రాధిక మర్చంట్

ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల ప్రి వెడ్డింగ్ వేడుకలు కొనసాగుతున్నాయి. జూలై 3, బుధవారం రాధిక మర్చంట్ ఇంట్లో గుజరాతీ సంప్రదాయమైన మామేరు వేడుక జరిగింది. ఈ సందర్భంగా రాధిక మర్చంట్ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయింది.


బ్రష్ వాడకుండా షర్ట్ కాలర్ ను ఈజీగా ఎలా శుభ్రం చేయొచ్చో తెలుసా?

ఆఫీలకు వెళ్లేవారే కాదు, పార్టీకి వెళ్లేవారు, రాజకీయాల్లో తిరిగేవారు రెగ్యులర్ గా వైట్ దుస్తులనే వేసుకుంటారు. ఇక ఆఫీసుల్లో ఫార్మల్ దుస్తుల్లో వైట్ షర్ట్ లకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. తెలుపు రంగు ప్రతి ఒక్కరికీ నప్పుతుంది. అందుకే చాలా మంది వైట్ కలర్ షర్ట్ లను వేసుకోవడానికే ఇంట్రస్ట్ చూపుతారు. కానీ వీటిని శుభ్రం చేయడం పెద్ద సమస్యే. వైట్ షర్ట్ చాలా తొందరగా నల్లగా అవుతాయి. ఏ చిన్న మరక పడ్డా పెద్దగా కనిపిస్తుంది. అందులోనూ వైట్ షటర్ట్ లపై పడిన మరకలు...


కళ్లు ఎన్ని రంగులు ఉంటాయో తెలుసా.. ఏవి ఆకర్షణీయంగా ఉంటాయంటే..!

మనుసులో ఉన్నది కళ్లలో కనిపిస్తుందని అంటుంటారు. మనలోని భావాల్ని కళ్లు ప్రదర్శిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేనా మనలో ఆకర్షణీయంగా కనిపించే భాగాల్లో కళ్లు మొదటి స్థానంలో ఉంటాయి. అయితే ప్రపంచంలో కేవలం నలుపు రంగు, నీలికళ్లే కాదు.. ఇంకా చాలా రంగుల కళ్లు ఉన్నాయంట. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది కనుపాపలు నలుపు రంగులో ఉంటాయి. నిజానికి అది నలుపు కాదు.. గోధుమ రంగు. మెలనిన్‌ అనే వర్ణద్రవ్యం ఎక్కువగా ఉన్నవాళ్ల కళ్లు నలుపుగా కనిపిస్తాయి. దాదాపు 70 నుంచి 79 శాతం ప్రజలకు ఈ గోధుమ రంగు కళ్లే ఉన్నాయి. ఆఫ్రికా, తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా వాసులకు ముదురు గోధుమ రంగు కళ్లు.. దక్షిణాసియా, అమెరికా, యూరప్‌ ప్రజలకు లేత గోధుమ రంగు కళ్లు ఎక్కువగా ఉంటాయట. ప్రపంచంలో 8 నుంచి 10 శాతం మందికి నీలిరంగు కళ్లు ఉంటాయి. యూరప్‌లో అందులో ముఖ్యంగా స్కాండినేవియాలో వీళ్లు అధికం. కొన్ని వేల సంవత్సరాల కిందట అందరికీ గోధుమ రంగు కళ్లే ఉండేవట. ఆ తర్వాత మనుషుల జన్యువుల్లో మార్పులు వచ్చి, కనుపాప రంగు మారింది. కనుపాప రంగు పాక్షికంగా తల్లిదండ్రుల జన్యువు నుంచి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. నీలిరంగు కళ్లున్న వ్యక్తులు చీకటిలోనూ చూడగలరట. అయితే పగటి పూట సూర్యకాంతిని తట్టుకోలేరని నిపుణులు చెబుతున్నారు. ఆకుపచ్చ, నారింజ, బంగారు వర్ణాల కలయికతో లేత గోధుమ రంగు ఉంటుంది. ఇలాంటి కళ్లున్నవారు ప్రపంచవ్యాప్తంగా 5 శాతం మంది ఉన్నారు. ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలు, బ్రెజిల్‌, స్పానిష్‌ ప్రజలకు ఈ రంగు కళ్లు ఎక్కువగా ఉంటాయట. పిల్లులకు ఉండే బూడిదరంగు కళ్లు ప్రపంచంలో 3 శాతం మనుషులకు ఉంటాయి. కనుపాప రంగుకు కారణమయ్యే మెలనిన్‌ అనే వర్ణద్రవ్యం తక్కువ మొత్తం ఉండటం, కంటిలోని స్ట్రోమా భాగంలో కొలాజిన్‌ ప్రొటీన్‌ ఎక్కువగా ఉండటంతో కనుపాప నీలిరంగులోకి మారకుండా అడ్డంకి ఏర్పడుతుందట. ఫలితంగా కనుపాప బూడిద రంగులో కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగు కళ్లున్నవాళ్లు ఎక్కువగా ఉత్తర, తూర్పు యూరప్‌లో ఉంటారు. ప్రపంచ జనాభాలో 2శాతం మంది కళ్లు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఉత్తర, మధ్య, పశ్చిమ యూరప్‌లో ఆకుపచ్చ కళ్లు ఉన్న వ్యక్తులు ఎక్కువ. వీరిలో 16 శాతం సెల్టిక్‌, జర్మన్ల వారసులై ఉంటారని అంచనా. ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌లో 86 శాతం మంది నీలి, ఆకుపచ్చ రంగు కళ్లున్నవారు ఉన్నారు.


మీ వైవాహిక బంధాన్ని దృఢంగా మార్చే మార్గాలు!

ఈరోజుల్లో వ్య‌క్తిగ‌త జీవితం, ఉద్యోగ జీవితాన్ని బ్యాలెన్స్ చేయ‌లేక చాలా వైవాహిక బంధాలు బ‌ల‌హీనంగా మారుతున్నాయి. అందుకే మీ వైవాహిక జీవితం మ‌రింత దృఢంగా ఉండేందుకు ఈ చిట్కాలు పాటించండి.


మార్కెట్లో దొరికే ఫ్రోజెన్ వెజిటబుల్స్‌ను తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Frozen Vegetables: సాధారణంగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటివి ఎక్కువ కాలం నిల్వ ఉండవు. అందుకే వీటిని ఫ్రిజ్‌లో పెట్టి స్టోర్ చేస్తారు. అయితే పూర్తిగా పండకముందే కోసిన కూరగాయల్లో పోషక విలువలు తగ్గవచ్చు. అందుకే అవి పూర్తిగా పక్వానికి వచ్చిన తర్వాతే కోసి, నిల్వచేయడానికి ఫ్రీజింగ్ చేయవచ్చు. అంటే అతిశీతల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తారు. వాటిని ప్యాకింగ్ చేసి అమ్ముతారు. ఇప్పుడు ఇలాంటి ఫ్రోజెన్ వెజిటేబుల్స్‌ (Frozen vegetables) కూడా మార్కెట్లలో...


Monsoon Skin Care: వర్షాకాలంలో మీ చర్మం జడ్డుగా మారుతోందా, ఈ టిప్స్ ట్రై చేయండి

Monsoon Skin Care: వర్షాకాలంలో మీ చర్మం జడ్డుగా మారుతోందా, ఈ టిప్స్ ట్రై చేయండి


Ketu Transit: కేతువు సంచారంతో ఈ రాశులవారికి అడుగడుగునా డబ్బే..

Ketu Blessing Zodiac Sign 2024: కేతువు సంచారంతో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మేష, వృషభ రాశులవారికి అనుకున్న పనులన్నీ జరుగుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


రాశిఫలాలు 05 జూలై 2024:ఈరోజు ధృవ యోగం వేళ సింహం, తులా రాశులతో సహా ఈ రాశులకు ధన లాభం..!

horoscope today 05 July 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు జ్యేష్ఠ అమవాస్య వేళ కొన్ని శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించనుంది. ఈ సందర్భంగా ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం...


Natural Tips For Belly Fat: ఈ సింపుల్‌ టిప్స్‌తో.. బెల్లీ ఫ్యాట్‌ వెన్నలాగా కరిగిపోతది..!

Natural Tips For Belly Fat: ఈ సింపుల్‌ టిప్స్‌తో.. బెల్లీ ఫ్యాట్‌ వెన్నలాగా కరిగిపోతది..!


Banana: వీళ్లు అరటి పండును అస్సలు తినకూడదు.. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది..

అరటి పండు అంటే చాలా మంది ఇష్టపడతారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు కూడా చేస్తుంది. ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ పండుని చిన్న పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. (ప్రతీకాత్మక చిత్రం) అయితే ఈ పండును కొన్ని సమస్యలు ఉన్న వాళ్లు తింటే ప్రమాదకరంగా మారుతుంది. దాని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.(ప్రతీకాత్మక చిత్రం) అరటి పండులో సహజంగా చక్కెర ఎక్కువగా ఉంటుంది. అయితే మధుమేహం ఉన్న వారు ఈ పండును తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు. అంతే కాకుండా.. అరటి పండులో పొటాషియం కూడా అధికంగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం) మూత్రపిండాల సమస్యతో బాధపడే వారు ఈ పండుకు దూరంగా ఉంటే మంచిదని డాక్టర్స్ సలహా ఇస్తున్నారు. అదనపు పొటాషియాన్ని విసర్జించడం ఈ సమస్య ఉన్నవారికి కష్టంగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం) కావునా ఈ పండును స్కిప్ చేయడం మంచిది. మలబద్ధకం ఉన్నవారు కూడా అరటి పండుకు దూరంగా ఉండాలి. ఇది మలబద్ధకం సమస్యను తొలగించడానికి బదులు దానిని మరింత తీవ్రతరం చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం) అరటి పండును ప్రతీ ఒక్కరూ ఇష్టపడినా.. అలర్జీ ఉన్నవారు దూరంగా ఉండాలి. ఈ సమస్య ఉన్నవారు తింటే.. వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అనాఫిలాక్సిస్ వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం) ఆస్తమాతో బాధపడే వారు ఈ పండుకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అరటి పండు తింటే.. ఈ సమస్య మరింత పెరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం) ఎక్కువగా అరటి పండ్లు తింటే మలబద్ధకంతోపాటుగా కొన్ని ఉదర సంబంధిత సమస్యలు వేధిస్తాయి. అరటిలో కొన్ని సమ్మేళనాలు మైగ్రేన్ ను ప్రేరేపిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)


పది పాస్ అయిన వారికి భారీ శుభవార్త.. వెంటనే త్వరపడండి..

పిల్లల చదువుల కోసం తల్లి తండ్రులు ఎప్పుడు ఒక అడుగు ముందుగానే ఆలోచన చేస్తారు. ఎందుకంటే వారి భవిష్యత్తు కు బాటలు వేసేది చదువు ఒక్కటే కాబట్టి. కానీ కొంత మంది ఎంత మంచిగా చదివిన మంచి స్కూల్లో లేదా మంచి కాలేజీల్లో చదవటానికి ఇంట్లో సరిపడా వసతులు లేక అందుబాటులో లేక తక్కువ ఫీజు ఉన్నవాటిలో చేరి చదువుతుంటారు.కానీ ఇప్పుడు ఈ రోజుల్లో అలాంటి పరిస్థితులు ఇక్కడ లేవు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో లేదా ప్రభుత్వ కాలేజీల్లో ప్రైవేట్ కి ధీటుగా వసతులు తో పాటు...


చిగుళ్లను బలంగా మార్చే చిట్కాలు ఇవే!

చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం కొన్ని చిట్కాలు పాటించడం ఉత్తమం. అవేంటో తెలుసుకుందాం.


Panchangam Today: ఈ రోజు అలాంటి పనులకు అసలు మంచిది కాదు

నేడు 5 జులై 2024 బుధవారం, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, జ్యేష్ట మాసం, బహుళ పక్షం.మాసశివరాత్రి ఇవాళ 5 గంటల 35 నిమిషాలకు సూర్యోదయం. నేడు సాయంత్రం 6 గంటల 37 నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది. ఇవాళ తిథి బహుళ త్రయోదశీ. ఉదయం 5 గంటల .54 నిమిషాల వరకు కలదు. చతుర్దశి రాత్రి అనగా తెల్లవారుజామున :4 గంటల .58నిమిషాల వరకు తదుపరి: అమావస్య . వారం: బృహస్పతివాసరె నక్షత్రం: మృగశిర రా:3గంటల 54నిమిషాల వరకు తదుపరి: ఆర్ధ్ర.యోగం: గండ ,ఉదయం 6గంటల 59నిమిషాల వరకు. ఉదయం 9 గంటల 1 నిమిషం వరకూ. వృద్ది రాత్రి అనగా తెల్లవారు జామున 5గంటల .13నిమిషాల వరకు. తదుపరి: దృవ .కరణం:వణిజ ఉదయం 5గంటల 54నిమిషాల వరకు తర్వాత భద్ర సాయంత్రం 5గంటల 26నిమిషాల వరకు. తదుపరి శకుని రాత్రి తెల్లవారుజామున :4గంటల 58నిమిషాల వరకు.తదుపరి:చతుష్పాత్ అమృతకాలం రాత్రి 7గంటల 11నిమిషాల నుండి 8గంటల 46నిమిషాల వరకు ఉంది. నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు. దుర్ముహూర్తం ఉదయం 10గంటల 10నిమిషాల నుండి 11గంటల 2నిమిషాల వరకు. తిరిగిమధ్యాహ్నం:3గంటల 23నిమిషాల నుండి 4గంటల 15నిమిషాల వరకు కలదు. ఇది మంచి ముహూర్తం కాదు. అందువల్ల ఎవరూ ఈ సమయంలో ముహూర్తాలు పెట్టుకోరు. రాహుకాలం మధ్యాహ్నం :ఒంటి గంట 30నిమిషాల నుండి 3గంటల వరకు ఉంది. రాహుకాల సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయరు. యమ గండకాలం ఉదయం :06 గంటల నుండి 7గంటల 30నిమిషాల వరకు ఉంది. ఈ యమగండ కాలాన్ని శుభ సమయంగా పరిగణించరు. యమగండాన్నే కేతుకాలం అని కూడా అంటారు. అన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఈ రోజు వర్జ్యం ఉదయం 9గంటల 40నిమిషాల నుండి 11గంటల 15నిమిషాల వరకు కలదు ఉంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


తలలో పెన్ను గుచ్చుకుని నాలుగేండ్ల చిన్నారి దుర్మరణం

తలలో పెన్ను గుచ్చుకుని నాలుగేండ్ల చిన్నారి దుర్మరణం భద్రాచలం, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో తలలో పెన్ను గుచ్చుకుని నాలుగేండ్ల చిన్నారి చనిపోయింది. పట్టణంలోని సుభాష్​నగర్​ కాలనీకి చెందిన రియాన్షిక (4) యూకేజీ చదువుతోంది. సోమవారం మంచంపై పడుకుని పెన్నుతో ఆడుకుంటోంది. అకస్మాత్తుగా బెడ్​పై నుంచి కింద పడడంతో చేతిలోని పెన్ను చెవి పైభాగంలో...


Crispy Wada Recipe : టేస్టీ టేస్టీ వడలు.. తక్కువ పదార్థాలతో సింపుల్​గా చేసుకోగలిగే రెసిపీ ఇది

Tasty Wada Recipe : ఛాయ్​కి కాంబినేషన్​గా ఏమైనా తినాలనుకుంటే.. లేదా హెల్తీ స్నాక్స్ తీసుకోవాలనుకుంటే కాబూలీ చనాతో వడలు చేసుకోవచ్చు. ఇది పిల్లల నుంచి పెద్దలవరకు అందరికీ నచ్చే రెసిపీ ఇది. పలు రెస్టారెంట్స్​లో కూడా దీనిని చేస్తారు. అయితే ఈ టేస్టీ రెసిపీని చేయడానికి అవసరమయ్యే పదార్థాలు ఏమిటి? ఎలా తయారు చేయాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు - 2 చిన్నవి ఉప్పు - రుచికి తగినంత పెద్ద శనగలు - 1 కప్పు బేకింగ్ పౌడర్ - అర...


horoscope prediction in telugu 4 july 2024: ఈ రాశులవారు షేర్ మార్కెట్లో లాభపడతారు , ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది - జూలై 04 రాశిఫలాలు

జూలై 04 రాశిఫలాలు మేష రాశి ఈ రోజు ఏదో ఒక విషయంలో టెన్షన్ ఉండవచ్చు. మీ స్నేహితులతో టైమ్ స్పెండ్ చేస్తారు. వైవాహిక జీవితం బావుంటుంది. ప్రేమికులు పెళ్లిదిశగా అడుగేసేందుకు మంచి రోజు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఆందోళనలు ఉండవచ్చు. ఎవరికీ సలహా ఇవ్వకండి. వృషభ రాశి ఈ రోజు మీరు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మీ పనులు పూర్తి చేస్తారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు...


Period products: ప్యాడ్స్ బదులు ఇవి వాడితే ఎన్ని లాభాలో ఊహించలేరు.. చిన్న మార్పుతో గొప్ప మేలు..

Period products: డిస్పోజబుల్ శానిటరీ న్యాప్‌కిన్స్‌తో పోలిస్తే రీయూజబుల్ పీరియడ్ ప్రొడక్ట్స్ వాడకం వల్ల డబ్బు ఆదా అవుతుంది. పర్యావరణానికి మేలు చేసినవాళ్లమవుతాం. కానీ వాటి వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూడండి.


ఈనెలలో ఏకాదశి నాడు ఈ పరిహారాలు పాటించండి.. దెబ్బకి మీ దరిద్రం తీరిపోతుంది..!

హిందూ ధర్మంలో ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏకాదశి మహా విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనదిగా చెపుతుంటారు. శాస్త్రాల ప్రకారం ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే ఎంతో శుభమని చెపుతారు. దీని వల్ల నరకం అనుభవించాల్సిన అవసరం ఉండదని.. పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుందని.. కోరుకున్న కోరికెలు నెరవేరుతాయని అంటుంటారు. నిజానికి ప్రతి నెలా రెండు ఏకాదశులు వచ్చినప్పటికీ.. ఎన్నో సంవత్సరాల తర్వాత జూలై 2024లో అరుదైన యోగం ఉంది. ఈ నెలలో మొత్తం మూడు ఏకాదశలు వస్తున్నాయి. ఆషాఢ మాసంలో కృష్ణ పక్షం యొక్క యోగిని ఏకాదశి జూలై 2 2024 న వస్తుంది. ఈ వ్రత మహిమ వల్ల మరణం తర్వాత స్వర్గం లభిస్తుందని నమ్ముతారు. యోగిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల 88,000 మంది బ్రాహ్మణులకు అన్నం పెట్టినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఒక వ్యక్తి స్వర్గానికి చేరుకుని తన జీవితంలోని అన్ని ఆనందాలను ఆస్వాదిస్తాడంట. ఆషాఢ మాసంలో శుక్లపక్షానికి చెందిన దేవశయాని ఏకాదశి 2024 జూలై 17న వస్తుంది. ఈ రోజు నుండి భగవంతుడు 4 నెలలు నిద్రపోతాడు. దేవశాయని ఏకాదశి రోజు నుంచి విష్ణువు 4 నెలల పాటు యోగనిద్రలో ఉండి సృష్టి బాధ్యతను శివునికి అప్పగిస్తాడు. దేవశాయని ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల ప్రమాదాలు తప్పవని నమ్ముతారు. కుటుంబంలో సంతోషం, సౌభాగ్యం నెలకొంటాయి. ఇక శ్రావణ మాసంలో కృష్ణ పక్షం యొక్క కామిక ఏకాదశి జూలై 31, 2024. ఈ ఉపవాసం ఆచరించడం ద్వారా మహా యజ్ఞ ఫలాలు లభిస్తాయని నమ్ముతారు. కామికా ఏకాదశిని పూజించడం ద్వారా సకల దేవతలను, గంధర్వులను, సూర్యుడిని పూజించిన ఫలం లభిస్తుందంట. మనిషి జీవితంలో సకల సుఖాలు పొంది, దుఃఖాలన్నీ అంతమవుతాయని భావిస్తారు.


చలో.. సోలో!

రోజులు మారేకొద్దీ మనుషుల అభిరుచుల్లో మార్పు వస్తున్నది. ఒకప్పుడు విహారం అనగానే అమ్మానాన్న, తాతాబామ్మ, అత్తామామ, పిన్ని బాబాయ్‌ వాళ్ల పిల్లలు ఇలా కుటుంబాలన్నీ లగేజీలతో సిద్ధమయ్యేవి. తర్వాతి కాలంలో అది ఒక ఇంటికే పరిమితమైంది.


జూలై 3 రాశిఫలాలు: తక్కువ పని - ఎక్కువ ప్రశంసలు..ఈ రాశివారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది!

జూలై 03 రాశిఫలాలు మేష రాశి ఈ రోజు మీరు ప్రయాణం చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. వ్యాపారంలో ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉంటాయి కానీ సవాళ్లు కూడా ఉంటాయి. సహోద్యోగుల పట్ల అసంతృప్తిగా ఉంటారు. అర్థరహితమైన విషయాలను పదే పదే పునరావృతం చేయొద్దు. వైవాహిక జీవితం బావుంటుంది. వృషభ రాశి ఈ రోజు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మీరు మీ పని శైలిని మార్చుకోవాల్సి ఉంటుంది. వ్యాపారులకు నూతన అవకాశాలు లభించవచ్చు. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత వహిస్తారు. మీ మనసులో కొత్త...


దెయ్యాలు, భూతాలు కాదు.. కుక్కల ఏడుపు వెనుక అసలు కారణం ఇదే..!

కుక్కలు తెలివైనవి.. అత్యంత నిజాయితీగల జంతువులు. అయితే చాలా మందికి నచ్చవు. కానీ అవే కుక్కలు ఒక్కోసారి ప్రమాదకరంగా ఉంటాయి. కుక్కకాటుతో మరణించిన కేసులు కూడా ఉన్నాయి. ఇది కొన్నిసార్లు కుక్కల ప్రవర్తన గురించి చాలా అపోహలు వెలుగుచూస్తుంటాయి. చాలా మంది కుక్క ఏడుపును చెడుకు సంకేతంగా భావిస్తారు. దీనికి సంబంధించి అనేక ఊహాగానాలు ఉన్నాయి. ఆత్మలు, దెయ్యాలను చూడటం వల్ల కుక్కలు ఏడుస్తాయని చెబుతారు. అంతేకాక, కుక్కలు ఏడవడం ఏదో చెడుకు సంకేతం అని కొందరు భావిస్తారు. కానీ కుక్కలు ఏడవడానికి నిజమైన కారణాలు ఉన్నాయా లేదా శాస్త్రీయ కారణం ఏంటి. వాటిని ఎలా అర్ధం చేసుకోవాలి. తరచుగా రాత్రిపూట కుక్కలు ఏడుపు వినిపిస్తుంటుంది. దీని తర్వాత మనకు అనేక ఆలోచనల ప్రారంభం అవుతాయి. కుక్కలు ఏడవడం చిన్నప్పటి నుండి మన మనస్సులో నిలిచిపోయిన చెడు సంకేతం. ఆత్మలను చూసిన కుక్కలు, పిల్లులు ఏడుస్తారని పెద్దలు చెపుతుంటారు. అయితే ఇందులో నిజం ఉందో లేదో తెలుసుకునే ప్రయత్నం ఎవరూ చేయరు. ప్రస్తుతం సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది. ఎన్నో విషయాలు, క్లిష్టమైన ప్రశ్నలకు ఇప్పుడు సులభంగా సమాధానాలు తెలుస్తున్నాయి. ఇదే క్రమంలో కుక్కల ఏడుపు గురించి సమాజంలో ఉన్న నమ్మకాలు నిజమో కాదో కూడా సైన్స్ సహాయంతో తెలుసుకోవచ్చు. నిజానికి వేసవి కంటే చలి కాలంలో.. కుక్కలు తరచుగా ఏడుస్తుంటాయి. అదికూడా రాత్రిపూట మాత్రమే ఏడుస్తాయి. దీని వెనుక అసలు కారణం వింటే ఇకపై ఆ ఏడుపుకి భయపడరు. ఎందుకంటే చలికాలంలో కుక్కలు మరీ చలిగా ఉంటే ఏడుస్తాయంట. ఆ చలిని తట్టుకోలేక అలా చేస్తాయంట. అంతేకాదు కుక్కలు తమ సహచరులకు ఏదో ఒక సందేశాన్ని ఇవ్వాలనుకున్నా ఏడుస్తాయని నిపుణులు అంటున్నారు. ఇక పగటిపూట కుక్కలు ఏవైనా తినకూడనివి తింటే వాటికి రాత్రి సమయంలో నొప్పి పెరుగుతుంది. దీంతో అవి ఏడవడం మొదలు పెడతాయని చెపుతున్నారు. దీనితో పాటు సాధారణంగా శీతాకాలంలో రాత్రి సమయం ఎక్కవ సేపు ఉంటుంది. ఇలాంటి రోజుల్లో కొన్నిసార్లు కుక్కలకు ఆకలి వేస్తుంది. తినడానికి ఏమీ దొరక్కపోతే కుక్కలు ఏడవడం మొదలుపెడతాయంట. ఒంటరితనం కూడా ఏడుపుకు కారణం అంటున్నారు నిపుణులు. కుక్కలు సమూహాలుగా నివసించే జంతువులు. సందుల్లో నివసించే కుక్కలను వారి కుటుంబాలకు దూరంగా ఉంచినప్పుడు, అవి రాత్రిపూట ఏడుస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కుక్కలు పెద్దయ్యాక రాత్రిపూట ఏడుస్తాయి. వయసు పెరుగుతున్న కొద్దీ కుక్కల మనసుల్లో భయం పెరుగుతుంది. అక్కడే ఒంటరితనం వస్తుంది. దీంతో రాత్రిపూట కుక్కలు ఏడుస్తుంటాయంట.


వైట్‌రైస్‌కి బ‌దులుగా ఇవి తింటే మేలు!

మ‌న రోజువారీ డైట్‌లో వైట్‌రైస్ ఖ‌చ్చితంగా ఉంటుంది. కానీ వైట్ రైస్ తిన‌డం వ‌ల‌న అధిక‌ బ‌రువు, షుగ‌ర్ వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే ప్ర‌మాదం ఉంది. అందుకే ఇప్పుడు వైట్‌రైస్‌కి బ‌దులుగా ఏం తినొచ్చో తెలుసుకుందాం.


పంట పొలాల్లోకి ఎలుకలు రాకుండా ఉండాలంటే.. ఇలా చేయాలి

విచ్చలవిడి పశువులతో పాటు ఎలుకలు రైతుల పంటలను దెబ్బతీస్తున్నాయి. కాబట్టి రైతులు వాటిని చంపడానికి మార్గాలను కనుగొంటారు. కానీ ఈ రోజు మనం ఒక పరిష్కారాన్ని కనుగొన్నాము. దీనిలో మీరు జంతువులను లేదా ఎలుకలను చంపాల్సిన అవసరం లేదు. పొలాల్లో ఎలుకల బెడద రైతులకు తలనొప్పిగా మారింది. ఎక్కువగా నాటిన తర్వాత పంట చేతికి వచ్చే వరకు ఎలుకలు పొలాల్లో సంచరిస్తుంటాయి. అవి విత్తనాలతో సహా పంటలకు కూడా చాలా నష్టం కలిగిస్తాయి. పొలంలో ఆహారం కోసం వెతుకుతున్న ఎలుకలు నష్టాన్ని కలిగిస్తాయి. ఎలుకలు పొలంలోకి రాకుండా రైతులు అనేక చర్యలు తీసుకోవచ్చు. దీని గురించి హజారీబాగ్ జియాలజిస్ట్ డాక్టర్ ముఖేష్ సిన్హా లోకల్ 18కి తెలిపారు.ఎలుకల ముక్కు, చెవులు, నోరు చాలా సున్నితంగా ఉంటాయని చెప్పారు. రైతులు తమ పొలాల నుండి ఎలుకలను తరిమికొట్టడానికి అనేక చర్యలు తీసుకోవచ్చు. పొలం నుండి ఎలుకలను తరిమికొట్టడానికి రైతులు ఎండుమిర్చి, కారపు మిరియాలు ఉపయోగించవచ్చు. రైతులు ఎండుమిర్చి, కారం పొడిని తయారు చేసి పొలంలో ఎలుకల వచ్చే దగ్గర చల్లాలి. కాబట్టి ఎలుకలు పంట చేలోకి రాకుండా పారిపోతాయి. రైతులు పొలాల్లో కర్పూరం నూనెను వాడవచ్చని వెటనరీ డాక్టర్ ముఖేష్ తెలిపారు. కర్పూర తైలం వాడాలంటే చిన్న చిన్న దూదిని తయారు చేసి వేర్వేరు చోట్ల చల్లుకోవాలి. కర్పూరం కట్ట ఒక ప్రత్యేక వాసనను వెదజల్లుతుంది. ఇది ఎలుకలు పారిపోయేలా చేస్తుంది. ఈ పద్ధతిలో రైతులు కర్పూరం కాకుండా పిప్పరమెంటు నూనెను కూడా ఉపయోగించవచ్చు. పొలాల నుండి ఎలుకలను తరిమికొట్టడానికి రైతులు వాటి ధరలకు వ్యతిరేకంగా దాల్చిన చెక్క ఆకులు లేదా పటిక ద్రావణాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఈ రెండూ కూడా ఒక ప్రత్యేక రకమైన సువాసనను వెదజల్లుతాయి. దాని ఫలితంగానే ఎలుకలు పొలాల్లోకి రాకుండా పారిపోతాయి.


Snakes: ఇలా చేస్తే దెబ్బకి పాములు పరార్.. మళ్లీ మీ ఇంటి దరిదాపుల్లోకి రావు..!

పాములు అత్యంత విషపూరితమైన, ప్రాణాంతకమైన జీవులుగా చెపుతుంటారు. వాటి బారిన పడకుండా ఉండాలంటే మనం వాటికి దూరంగా ఉండటమే మంచిది. ఇక మన దేశంలో చాలా ప్రాంతాల్లో.. పాములను దేవతగా పూజిస్తారు. నాగరాజు, నాగరాణి వంటి అనేక పేర్లతో పిలుచుకునేవారు. పాము శివుని మెడలో ఉంటుంది.. విష్ణువు పాముపై పడుకొని ఉంటారని ప్రజలు విశ్వసిస్తున్నారు.. వాటిని పూజించి మొక్కులు చెల్లిస్తుంటారు. సాధారణంగా పాములు మనుషులను చూసిన తర్వాత పారిపోతుంటాయి.. కానీ కొన్నిసార్లు కాటేస్తాయి. దీని వల్ల వేలాది మంది మరణిస్తున్నారు. అయితే వీటన్నింటితో పాటు మరో నిజం కూడా ఉంది. అదేమిటంటే.. ఈ పాములు రైతులకు మిత్రులుగా పొలాల్లో ఎలుకలను చంపేస్తాయి. ఇదే కాకుండా ఆశ్చర్యకరంగా.. కొన్ని ప్రాణాంతక వ్యాధులకు మందులు కూడా పాము విషం నుంచే తయారు చేస్తారని నివేదికలు చెపుతున్నాయి. ఒక అంచనా ప్రకారం, మొత్తం 300 జాతుల పాములలో, కేవలం 50 మాత్రమే విషపూరితమైనవి. వీటిలో భారతదేశంలో కనిపించే అత్యంత ప్రమాదకరమైన పాము నాగుపాము. దీని శరీరంపై గోధుమ లాంటి గుర్తులు ఉన్నందున దీనిని వీటీష్ అని కూడా అంటారు. పాములను చంపి పట్టుకోవడం కంటే వాటిని తరిమేయడమే సరైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ఇది సహజ సమతుల్యతను కూడా కాపాడుతుంది. ఎందుకంటే పాములు ఎలుకలను వేటాడతాయి, ఇవి మన పంటలను దెబ్బతీస్తాయి. అటువంటి పరిస్థితిలో పాము మన మధ్య ఉండటం చాలా ముఖ్యం. కానీ వారి దగ్గరికి వెళ్లడం చాలా ప్రమాదకరం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పాములు పొలాల్లోకి వస్తే ఎలా తరిమి కొట్టాలి..? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. కానీ భారతదేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో, రైతులు ఆవాల నూనెను కాల్చడం ద్వారా పాములను తరిమికొడుతున్నారు. నివేదికల ప్రకారం, రైతులు అనేక ఎకరాల్లో విస్తరించి ఉన్న పొలాల్లో నివసిస్తున్నప్పటికీ, పాములు తమ దగ్గరికి రాకుండా ఈ ఆవనూనెను కాలుస్తూ వాటిని తరిమి కొడుతున్నారు.


వర్షాకాలంలో ఆకుకూరలు తినాలా? వద్దా?

వర్షాకాలం చిరుజల్లులు వేడి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. కానీ ఈ చల్లని సీజన్ లో మనకు లేనిపోని రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. వర్షాకాలంలో దగ్గు, జలుబు, జ్వరం, ఫుడ్ పాయిజనింగ్, మలేరియా, డయేరియా మొదలైన వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. ఎందుకంటే మారుతున్న వాతవారణం వల్ల మన శరీర రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది. ఇలాంటి సమయంలో ఆకు కూరలను తినాలా? వద్దా? అనేది తెలుసుకుందాం పదండి. వర్షాకాలంలో ఆకుపచ్చని రకరకాల కూరగాయలను బాగా పండిస్తారు. కానీ ఈ సీజన్ లో, చల్లని...


ఈ కూరగాయలు సాగు చేస్తే.. లాభాలతో లక్షాధికారులు కావచ్చు

వ్వవసాయం, వ్యాపారం ఏదైనా లాభం బాగా వచ్చే దాని కోసం అందరూ అన్వేషిస్తారు. అలాంటి వాళ్లకు ఇది మంచి లాభసాటి సాగుతో పాటు వ్యాపారంగా చూడవచ్చు. గ్రామాల నుంచి నగరాల్లో కూడా వాణిజ్య పంటలను పండించడం ద్వారా మీరు ఇంట్లోనే లక్షలాది రూపాయలు సంపాదించవచ్చు. ఈ రోజుల్లో విద్యావంతులు కూడా లక్షల రూపాయల ఉద్యోగాలు వదిలి తమ ఆలోచనలతో పాటు ఆధునిక పద్దతులను అనుసరించి వ్యవసాయం వైపు చూపు మళ్లించుకుంటున్నారు. కొన్ని వాణిజ్య పంటలను పండిస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. బెండ సాగుతో బంపర్ లాభాలు పొందవచ్చు. ఈ కూరగాయల సాగు ఆర్థికంగా చాలా లాభదాయకంగా ఉంది. భూమి తక్కువగా ఉంటే, కూరగాయల సాగు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. తక్కువ భూమిలో ఎక్కువ చెట్లు వేసి దిగుబడి పొందవచ్చు.తద్వారా వాణిజ్య పంటలలో ఊహించని లాభాలు పొందవచ్చు. విత్తడం ఎలా?: బిందెలు విత్తే ముందు దాని గురించి సరిగ్గా తెలుసుకోవడం అవసరం. తద్వారా ఉత్పత్తి బాగుంటుంది. పంక్తుల మధ్య కనీసం 40-45 సెంటీమీటర్ల దూరం ఉండాలి. విత్తనాలను 3 సెంటీమీటర్ల కంటే ఎక్కువ లోతులో నాటకూడదు. మొత్తం పొలాన్ని తగిన ఆకారంలో స్ట్రిప్స్‌గా విభజించాలి. ఇది నీటిపారుదలని సులభతరం చేస్తుంది. హెక్టారుకు 15 నుంచి 20 టన్నుల ఎరువు అవసరం. నిందలు కూడా ఎప్పటికప్పుడు చేయాలి. తద్వారా ఎక్కువ దిగుబడి పొందవచ్చు. బెండకాయలతో ఆరోగ్యానికి మేలు:సమాచారం ప్రకారం బెండకాయలు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. అలాగే గుండె సంబంధిత వ్యాధులను కూడా దూరం చేస్తుంది. డయాబెటిక్ పేషెంట్లు కూడా బిండా తినాలి. అంతే కాకుండా మెంతికూర తినడం వల్ల రక్తహీనతలో కూడా మేలు జరుగుతుంది. ఎంత సంపాదిస్తారు?:బెండకాయ సాగును సక్రమంగా సాగు చేస్తే 1 ఎకరం 5 లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు. ఇందులో ఖర్చులు తీసివేస్తే కనీసం 3.5 లక్షల రూపాయలు ఆదా అవుతాయి. బెండ సీజన్‌లో మంచి ధరలను పొందుతుంది. సమాచారం ప్రకారం జార్ఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, అస్సాం , మహారాష్ట్రలు బెండకాయలను సాగు చేస్తున్న ప్రధాన రాష్ట్రాలు. ఇది కాకుండా హర్యానా ,రాజస్థాన్‌లలో కూడా దీనిని సాగు చేస్తున్నారు. (Disclaimer: ఇక్కడ అందించిన వ్యవసాయానికి సంబంధించిన సమాచారం సాధారణ సమాచారాన్ని మాత్రమే సూచిస్తుంది. News 18 దాని నిర్వహణ దీనికి బాధ్యత వహించదు. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు, దయచేసి మీ విచక్షణను ఉపయోగించండి. నిపుణుల మార్గదర్శకత్వం తీసుకోండి.)


మడమలు పగిలాయా? ఇలా చేసారంటే తొందరగా తగ్గిపోతాయి

మడమల పగుళ్ల సమస్య ఎక్కువగా ఆడవాళ్లకే ఉంటుంది. కానీ దీనివల్ల మడమల నుంచి రక్తం కారడం, నడుస్తున్నప్పుడు విపరీతమైన నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అయితే ఆడవాళ్లు ముఖ సౌందర్యంపై పెట్టే ఇంట్రెస్ట్ పాదాల విషయంలో అస్సలు పెట్టరు. ముఖం అందంగా కనిపించడానికని ఆడవాళ్లు ఎంతో కేర్ తీసుకుంటారు. కానీ కాళ్లు, పాదాల విషయంలో మాత్రం తీసుకోరు. దీనివల్లే మడమలు పగుళుతాయి. మడమలు పగలడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ పాదాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మడమలు...


కొబ్బరినూనెలో ఈ మూడు కలిపి అప్లై చేస్తే జుట్టు నల్లగా పొడుగ్గా పెరుగుతుంది..

ఆయిల్ మసాజ్‌ జుట్టుకి చాలా మంచిదని చెబుతారు. దీనికోసం బెస్ట ఆయిల్ గురించి తెలుసుకుందాం.


Puffed Rice Benefits:పేలాలను చిన్నచూపు చూస్తున్నారా? వాటి ఉపయోగాలు తెలిస్తే విడిచిపెట్టరు..!

Puffed Rice Nutrition: పేలాలు ప్రోటీన్, ఫైబర్, ఐరన్, కాల్షియం, విటమిన్లు వంటి పోషకాలు ఉంటాయి. వీటిని ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యలాభాలు పొందవచ్చు.


White Hair Solution: ఈ పువ్వును ఆవాల నూనెలో కలిపి రాయండి.. తెల్ల జుట్టు వెంటనే పరార్

White Hair Solution: ఈ పువ్వును ఆవాల నూనెలో కలిపి రాయండి.. తెల్ల జుట్టు వెంటనే పరార్


ఆడవాళ్లు కాళ్లకు నల్లదారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా?

చాలా మంది ఆడవారు చేతి మణికట్టుకు లేదా కాళ్లకు నల్ల తాడును కట్టుకుంటారు. కొంతమంది స్టైల్ కోసం దీన్ని కడితే.. మరికొంతమంది నమ్మకాల వల్ల కట్టుకుంటారు. కాలికి నల్లదారం కట్టుకోవడం వల్ల మన శరీరానికి సంబంధించిన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా భారతదేశంలో ఈ సంప్రదాయం ఎన్నో ఏండ్ల నుంచి వస్తోంది. అసలు ఆడవారు నల్లదారం ఎందుకు కట్టుకుంటారు? దీన్ని కట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. నల్లదారం సంప్రదాయం కాళ్లకు...


Kasturi Haldi : ఈ పసుపుతో ఫేస్‌ప్యాక్ వేస్తే ముఖం మెరుస్తుంది..

Kasturi Haldi : పసుపు చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో కస్తూరి పసుపు మరీ మంచిది.


Horoscope: ఈ రాశుల వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది

Horoscope Today: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. రాశిఫలాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. మరి నేడు జులై 5శుక్రవారం నాడు, మేషం నుంచి మీనం వరకు ఏయే రాశులకు దినఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మేషం (Aries): (అశ్విని, భరణి, కృత్తిక 1)ఆదాయం పెరగడానికి సంబంధించిన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆర్థికసమస్యలు చాలావరకు తగ్గుతాయి. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. రావలసిన డబ్బుచేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల నుంచి ఊరటలభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్చేస్తారు. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. వృషభం(Taurus):(కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. అధికారులతో అనుకూలతలుపెరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. కొద్దిపాటివ్యయప్రయాసలతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పూర్తి చేస్తారు. అనేకమార్గాల్లో ఆదాయం పెరుగుతుంది కానీ, ఖర్చులు తగ్గించు కోవడం మంచిది.ప్రభుత్వం నుంచి గుర్తింపు, గౌరవాలు లభిస్తాయి. బంధువులతో వివాదాలుసమసిపోతాయి. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యతపెరుగుతుంది... మిథునం (Gemini): (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) కుటుంబపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలు సఫలంఅయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నం విషయంలో అనుకోకుండా ఒక కీలక సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సంబంధమైన ఒత్తిడి తగ్గే అవకాశంఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరు గుతుంది. బంధుమిత్రులకు ఆర్థికంగాసహాయపడతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుం టారు. వ్యక్తిగత సమస్యల నుంచికొద్దిగా ఉపశమనం లభిస్తుంది. బాకీలు వసూలు అవుతాయి. కర్కాటకం (Cancer):(పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)ఒకటి రెండు విషయాల్లో విజయాలు సాధిస్తారు. అనుకోకుండా ఓ ముఖ్యమైనవ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడంమంచిది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. రాబడి నిలకడగాసాగిపోతుంది. కొద్దిపాటి ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఇంటా బయటా బాధ్యతలుపెరుగుతాయి. ఉద్యోగంలో అధికారులతో ఇబ్బందులుంటాయి. బంధుమిత్రులతో రోజంతాసరదాగా సాగిపోతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా గడిచిపోతుంది.. సింహం(Leo):(మఖ, పుబ్బ, ఉత్తర 1)ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఇతరుల విషయాల్లోజోక్యం చేసుకోవద్దు. వృత్తి, వ్యాపారాలు లాభాల్లో ఘన విజయాలు సాధిస్తాయి.కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోపాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో కుటుంబ సభ్యుల సహాయంలభిస్తుంది. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తు తాయి. జీవిత భాగస్వామినిసంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యానికి లోటుం డదు.. కన్య (Virgo):(ఉత్తర 2,3,4. హస్త, చిత్త 1,2)ఉద్యోగంలో బాధ్యతల మార్పు జరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా అనుకూలతలుఉంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థికంగా ఆశించినపురోగతి సాధిస్తారు. ఆస్తి సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు.వ్యాపారాల్లో కొత్త కార్యక్రమాలు చేపట్టి లాభాలు అందుకుంటారు. మంచిపరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది.అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటుంది. తుల (Libra):(చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)వృత్తి, వ్యాపారాల్లో ఒకటి రెండు ఆర్థిక సమస్యలున్నా అధిగమిస్తారు. రాబడిక్రమంగా పెరుగు తుందే తప్ప తగ్గే అవకాశం లేదు. ఉద్యోగుల శక్తిసామర్థ్యాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుంచి ఆదరణపెరుగుతుంది. ఇష్టమైన మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. దైవ కార్యాల్లోపాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.ఆహార, విహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కుటుంబ జీవితంఅన్యోన్యంగా, సామరస్యంగా సాగిపోతుంది. వృశ్చికం(Scorpio):(విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. ఉద్యోగులకు కూడా మంచి అవకాశాలు అందివస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లోఆచితూచి అడు గేయడం మంచిది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. బంధువులతోచికాకులు తలెత్తు తాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. స్వల్పఅనారోగ్యానికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారం లభిస్తాయి.ఆశించిన శుభవార్తలు అందుతాయి.. ధనుస్సు(Sagittarius): (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)ఉద్యోగంలో పని ఒత్తిడి బాగా తగ్గుతుంది. హోదా మారే సూచనలున్నాయి. వృత్తి,వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితోకలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఒక శుభ కార్యంలో బంధుమిత్రులనుకలుసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. ఆరోగ్యంచాలావరకు కుదుటపడుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించేఅవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త అందుతుంది.. మకరం (Capricorn):(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) వృత్తి, వ్యాపారాలు నిలకడగా పురోగతి చెందుతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడిఉన్నప్పటికీ, ఫలితం ఉంటుంది. పెండింగు పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు.పెళ్లి ప్రయత్నం విషయంలో బంధు వుల నుంచి శుభవార్త అందుతుంది. కుటుంబంలోసుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. జీవిత భాగ స్వామితో కలిసి ఆలయాలుసందర్శిస్తారు. ఆర్థిక సమస్యలున్నా కొందరు బంధువులకు సహా యం చేస్తారు.అనుకోకుండా స్వల్ప అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.. కుంభం (Aquarius):(ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు కొద్దిగా తగ్గుతాయి. లావాదేవీలు,కార్యకలాపాలు పెరుగుతాయి. ఉద్యో గంలో బరువు బాధ్యతలు పెరిగి, విశ్రాంతికిదూరమవుతారు. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అన్యోన్యతపెరుగుతుంది. ముఖ్యమైన పనులన్నీ సకాలంలో పూర్తవు తాయి. ఇష్టమైన బంధువులరాకపోకలుంటాయి. కుటుంబ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. నిరుద్యోగులకుఉద్యోగం లభిస్తుంది. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బాగానేఉంటుంది.. మీనం(Pisces): (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. డబ్బు ఇవ్వడం,తీసుకోవడానికి సమ యం అనుకూలంగా లేదు. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, ఖర్చులుపెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు కొద్దిగా పెరుగుతాయి. ఏవిషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసు కోవద్దు. వీలైనంతగా ఆచితూచివ్యవహరించడం మంచిది. వ్యాపారాల్లో లాభాలు పరవాలేదని పిస్తాయి. కొందరుబంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.)


నాటిన మొక్కలను సంరక్షించాలి

వన మహోత్సవంలో మొక్కలు నాటడమే కాదు నాటిన ప్రతిమొక్కనూ సంరక్షించే బాధ్యతను ప్రతిఒక్కరూ తీసుకోవాలని రాష్ట్ర అటవీశాఖ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర రెవెన్యూ, ప్రజాసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.


Tea Coffee Side Effects: టీ-కాఫీలు తాగితే లివర్ పాడవుతుందా లేదా, వైద్యులేమంటున్నారు

Tea Coffee Side Effects: దేశంలో మెజార్టీ ప్రజలు ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగడాన్ని ఇష్టపడుతుంటారు. ఈ అలవాటు లివర్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని భావన ఉంది. ఇది ఎంతవరకూ నిజం, వైద్యులేం చెబుతున్నారో తెలుసుకుందాం.


Life Style News: ఫ్యామిలీ డాక్టర్​ ఇంపార్టెన్స్​ మీకు తెలుసా..

Life Style News: ఫ్యామిలీ డాక్టర్​ ఇంపార్టెన్స్​ మీకు తెలుసా.. పూర్వ కాలంలో సైకిల్​ ముందు ఒక బ్యాగ్​... వెనుక ఒక మందుల పెట్టె కట్టుకొని డాక్టర్లు పల్లెల్లో తిరిగేవారు. ఇక వారికి ఆయా గ్రామాల ప్రజల ఆరోగ్య విషయాలు పూర్తిగా తెలుస్తాయి. వారికి ఎప్పుడు ఏదైనా డిసీజ్​ వస్తే ... వారి ఆరోగ్య పరిస్థితి ఆ ఫ్యామిలీ డాక్టర్​ కు అంతా తెలుసు కాబట్టి.. ట్రీట్​ మెంట...


Worms in stomach: వామ్మో, అతడి కడుపు నిండా గుట్టల గుట్టలు పాములు - ఎలా బయటకు తీశారో చూడండి

మీకు పాములంటే భయమా? అయితే, ముందే చెబుతున్నాం. తప్పకుండా మీరు చూడబోయే వీడియో మీకు నిద్రలేకుండా చేస్తుంది. అంతేకాదు.. ఏం తింటున్నా అదే గుర్తుకొస్తుంది. పర్వాలేదు.. మాకు గుండె ధైర్యం టన్నుల కొద్ది ఉందంటే మీ ఇష్టం. మళ్లీ చివర్లో చెప్పలేదు.. ముందే చెప్పాలి కదా అనే మీమ్స్, కామెంట్స్ చేస్తే కుదరదు. సరే.. ఇక అసలు విషయంలోకి వెళ్లిపోదాం. ఎక్కడ జరిగిందో.. ఎప్పుడు జరిగిందో తెలీదుగానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. అందులో ఓ వ్యక్తికి...