కళ్లు ఎన్ని రంగులు ఉంటాయో తెలుసా.. ఏవి ఆకర్షణీయంగా ఉంటాయంటే..!
మనుసులో ఉన్నది కళ్లలో కనిపిస్తుందని అంటుంటారు. మనలోని భావాల్ని కళ్లు ప్రదర్శిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేనా మనలో ఆకర్షణీయంగా కనిపించే భాగాల్లో కళ్లు మొదటి స్థానంలో ఉంటాయి. అయితే ప్రపంచంలో కేవలం నలుపు రంగు, నీలికళ్లే కాదు.. ఇంకా చాలా రంగుల కళ్లు ఉన్నాయంట. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది కనుపాపలు నలుపు రంగులో ఉంటాయి. నిజానికి అది నలుపు కాదు.. గోధుమ రంగు. మెలనిన్ అనే వర్ణద్రవ్యం ఎక్కువగా ఉన్నవాళ్ల కళ్లు నలుపుగా కనిపిస్తాయి. దాదాపు 70 నుంచి 79 శాతం ప్రజలకు ఈ గోధుమ రంగు కళ్లే ఉన్నాయి. ఆఫ్రికా, తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా వాసులకు ముదురు గోధుమ రంగు కళ్లు.. దక్షిణాసియా, అమెరికా, యూరప్ ప్రజలకు లేత గోధుమ రంగు కళ్లు ఎక్కువగా ఉంటాయట. ప్రపంచంలో 8 నుంచి 10 శాతం మందికి నీలిరంగు కళ్లు ఉంటాయి. యూరప్లో అందులో ముఖ్యంగా స్కాండినేవియాలో వీళ్లు అధికం. కొన్ని వేల సంవత్సరాల కిందట అందరికీ గోధుమ రంగు కళ్లే ఉండేవట. ఆ తర్వాత మనుషుల జన్యువుల్లో మార్పులు వచ్చి, కనుపాప రంగు మారింది. కనుపాప రంగు పాక్షికంగా తల్లిదండ్రుల జన్యువు నుంచి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. నీలిరంగు కళ్లున్న వ్యక్తులు చీకటిలోనూ చూడగలరట. అయితే పగటి పూట సూర్యకాంతిని తట్టుకోలేరని నిపుణులు చెబుతున్నారు. ఆకుపచ్చ, నారింజ, బంగారు వర్ణాల కలయికతో లేత గోధుమ రంగు ఉంటుంది. ఇలాంటి కళ్లున్నవారు ప్రపంచవ్యాప్తంగా 5 శాతం మంది ఉన్నారు. ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలు, బ్రెజిల్, స్పానిష్ ప్రజలకు ఈ రంగు కళ్లు ఎక్కువగా ఉంటాయట. పిల్లులకు ఉండే బూడిదరంగు కళ్లు ప్రపంచంలో 3 శాతం మనుషులకు ఉంటాయి. కనుపాప రంగుకు కారణమయ్యే మెలనిన్ అనే వర్ణద్రవ్యం తక్కువ మొత్తం ఉండటం, కంటిలోని స్ట్రోమా భాగంలో కొలాజిన్ ప్రొటీన్ ఎక్కువగా ఉండటంతో కనుపాప నీలిరంగులోకి మారకుండా అడ్డంకి ఏర్పడుతుందట. ఫలితంగా కనుపాప బూడిద రంగులో కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగు కళ్లున్నవాళ్లు ఎక్కువగా ఉత్తర, తూర్పు యూరప్లో ఉంటారు. ప్రపంచ జనాభాలో 2శాతం మంది కళ్లు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఉత్తర, మధ్య, పశ్చిమ యూరప్లో ఆకుపచ్చ కళ్లు ఉన్న వ్యక్తులు ఎక్కువ. వీరిలో 16 శాతం సెల్టిక్, జర్మన్ల వారసులై ఉంటారని అంచనా. ఐర్లాండ్, స్కాట్లాండ్లో 86 శాతం మంది నీలి, ఆకుపచ్చ రంగు కళ్లున్నవారు ఉన్నారు.
2024-07-04T10:59:00Z
Hair Oiling : తలకు నూనె రాయటం అవసరమా.. ఆ తప్పు చేస్తే జుట్టు రాలిపోతుందా..?
రోజూ తలకు నూనె రాసుకోమని పెద్దలు సూచిస్తుంటారు. అయితే ఇప్పుడు తలకు నూనె లేకుండా తిరగటం ఫ్యాషన్ అయిపోంది. చాలా మంది తలకు నూనె పెట్టుకోవడం పూర్తిగా మానేశారు. దాని వల్ల జుట్టు రాలిపోవటం, చుండ్రు, కుదుళ్ళు బలహీనంగా మారటం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆయుర్వేదం జుట్టుకు నూనె రాయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నట్లు స్పష్టం చేస్తుంది. జుట్టుకు ఆయిల్ పూసి మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. జుట్టుకు బలం చేకూరుతుంది. బాడీ మసాజ్ లేదా హాట్ ఆయిల్ మసాజ్ రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడినట్లే తలలోని మూలాలను బలపరిచేందుకు తలకు నూనె రాయటం అవసరం. దీని వల్ల జుట్టు రాలడం, తెల్లగా మారటం, చుండ్రు వంటి అనేక రకాల సమస్యలను నయం చేయవచ్చు. చాలా మంది నూనె రాసుకోవడాన్ని నిర్లక్ష్యం చేస్తారు. వాస్తవానికి జుట్టుకు నూనె రాయడం అన్నది చాలా ముఖ్యం. నూనెతో జుట్టును సున్నితంగా మసాజ్ చేయడం వల్ల జుట్టు మదృువుగా మారుతుంది. అంతేకాకుండా తేమను పెంచుతుంది. జుట్టుకు మంచి మెరుపు సంతరించుకుంటుంది. నూనె రాయడం వల్ల జుట్టు పొడిబారకుండా ఉండి జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టు పొడిగా ఉండి చిట్లి పోతుంటే వారానికి మూడుసార్లు జుట్టుకు నూనె రాయడం జుట్టుకు బలం చేకూరుతుంది. దీంతో జుట్టు చిట్లకుండా ఉంటుంది. నూనె రాయటం వల్ల జుట్టు మెరిసేలా.. ఒత్తుగా కనిపించేలా చేస్తుంది. కొబ్బరి, ఆలివ్, నువ్వులు, బాదం, అర్గాన్, బృంగరాజ్, ఉసిరి వంటి సాధారణంగా ఉపయోగించే కొన్ని నూనెలు జుట్టు రాలడం, చుండ్రు, చిట్లిపోవడం, నెరవడం వంటి మొదలైన సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయి. పలు రకాల నూనెలు వివిధ విటమిన్లను కలిగి ఉంటాయి. ఈ నూనెలను నేరుగా పూయడంతో, జుట్టు కుదుళ్ళు బలపడతాయి. జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతిరోజూ నూనెను తప్పక రాయాలి. రోజు రాసుకోవటం కుదరకపోతే కనీసం వారానికి రెండుసార్లు జుట్టుకు నూనె రాయాలి. రాత్రి నిద్రకు ముందు తలకు నూనె బాగా పట్టించి ఉదయం తలస్నానం చేయటం వల్ల జుట్టుకు మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయటం వల్ల తలలో చుండ్రు తగ్గుతుంది. జుట్టు కూడా పెరుగుతుంది. నూనెల్లో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి జుట్టులోని లిపిడ్లను భర్తీ చేయడంలో సహాయపడతాయి. జుట్టు ఆరోగ్యంగా కనిపించేలా చేయడంలో లిపిడ్లు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. లిపిడ్లు వల్ల జుట్టు మెరవటంతోపాటు.. అందంగా ఉంటుంది. అయితే కొన్ని రకాల నూనెలు అలెర్జీని కలిగిస్తాయి. వాటిని రాసే ముందు ముందుగా కొద్దిగా రాసి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేవని నిర్దారించుకోవాలి. ఆతరువాతనే వాటిని ఉపయోగించాలి. (గమనిక : ఈ సమాచారం అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా సేకరించినది.. కేవలం అవగాహన కోసం మాత్రమే రాసినది. ఆచరించే ముందు వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది.
2024-07-03T14:10:52Z
Home Tips: దోమల బెడద ఎక్కువైందా? ఇంట్లో ఈ నీళ్లు చల్లండి చాలు..!
ప్రజలు వేడి కాలంలో చల్లబరచడానికి పుదీనాను తీసుకుంటారు. పుదీనా శరీరాన్ని చల్లబరచడమే కాకుండా ఆహారాన్ని రుచికరంగా మారుస్తుంది. పుదీనా యొక్క అనేక ప్రయోజనాలను ఆయుర్వేదం వివరిస్తుంది. డా. పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయని, ఇందులో విటమిన్ ఎ, సి, బి కాంప్లెక్స్, ఫాస్పరస్, కాల్షియం, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నాయని మకరంద్ కుమార్ లోకల్ 10కి తెలిపారు. ఇందులో ఐరన్, పొటాషియం , మాంగనీస్ వంటి పోషకాలు కూడా ఉన్నాయి. పుదీనా అజీర్ణం, గ్యాస్, అసిడిటీని పోగొట్టి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ఇది కాకుండా, దీనిని వంటలో కూడా ఉపయోగిస్తారు. ఇంట్లో నుండి దోమలు , ఈగలను తరిమికొట్టడానికి కూడా పుదీనా సహాయపడుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఇంటి చుట్టూ దోమలు, ఈగల బెడద ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితులలో పుదీనా ఆకులను ఉడకబెట్టి, దాని నీటితో చల్లుకోవాలి. వాష్ బేసిన్ పైపులో లేదా మరెక్కడైనా పురుగులు ఉంటే, పుదీనా ఆకులను బేకింగ్ సోడాతో కలిపి మెత్తగా చేసి ప్రభావిత ప్రాంతంలో రాయండి. ఈ పరిహారం కీటకాలను చంపుతుంది. (ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా నివారణను ప్రయత్నించే ముందు నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. News18 తెలుగు దీనిని ఆమోదించదు.)
2024-07-04T03:42:56Z