Horoscope: ఈ రాశుల వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది
Horoscope Today: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. రాశిఫలాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. మరి నేడు జులై 5శుక్రవారం నాడు, మేషం నుంచి మీనం వరకు ఏయే రాశులకు దినఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మేషం (Aries): (అశ్విని, భరణి, కృత్తిక 1)ఆదాయం పెరగడానికి సంబంధించిన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆర్థికసమస్యలు చాలావరకు తగ్గుతాయి. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. రావలసిన డబ్బుచేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల నుంచి ఊరటలభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్చేస్తారు. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. వృషభం(Taurus):(కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. అధికారులతో అనుకూలతలుపెరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. కొద్దిపాటివ్యయప్రయాసలతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పూర్తి చేస్తారు. అనేకమార్గాల్లో ఆదాయం పెరుగుతుంది కానీ, ఖర్చులు తగ్గించు కోవడం మంచిది.ప్రభుత్వం నుంచి గుర్తింపు, గౌరవాలు లభిస్తాయి. బంధువులతో వివాదాలుసమసిపోతాయి. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యతపెరుగుతుంది... మిథునం (Gemini): (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) కుటుంబపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలు సఫలంఅయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నం విషయంలో అనుకోకుండా ఒక కీలక సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సంబంధమైన ఒత్తిడి తగ్గే అవకాశంఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరు గుతుంది. బంధుమిత్రులకు ఆర్థికంగాసహాయపడతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుం టారు. వ్యక్తిగత సమస్యల నుంచికొద్దిగా ఉపశమనం లభిస్తుంది. బాకీలు వసూలు అవుతాయి. కర్కాటకం (Cancer):(పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)ఒకటి రెండు విషయాల్లో విజయాలు సాధిస్తారు. అనుకోకుండా ఓ ముఖ్యమైనవ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడంమంచిది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. రాబడి నిలకడగాసాగిపోతుంది. కొద్దిపాటి ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఇంటా బయటా బాధ్యతలుపెరుగుతాయి. ఉద్యోగంలో అధికారులతో ఇబ్బందులుంటాయి. బంధుమిత్రులతో రోజంతాసరదాగా సాగిపోతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా గడిచిపోతుంది.. సింహం(Leo):(మఖ, పుబ్బ, ఉత్తర 1)ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఇతరుల విషయాల్లోజోక్యం చేసుకోవద్దు. వృత్తి, వ్యాపారాలు లాభాల్లో ఘన విజయాలు సాధిస్తాయి.కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోపాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో కుటుంబ సభ్యుల సహాయంలభిస్తుంది. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తు తాయి. జీవిత భాగస్వామినిసంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యానికి లోటుం డదు.. కన్య (Virgo):(ఉత్తర 2,3,4. హస్త, చిత్త 1,2)ఉద్యోగంలో బాధ్యతల మార్పు జరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా అనుకూలతలుఉంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థికంగా ఆశించినపురోగతి సాధిస్తారు. ఆస్తి సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు.వ్యాపారాల్లో కొత్త కార్యక్రమాలు చేపట్టి లాభాలు అందుకుంటారు. మంచిపరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది.అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటుంది. తుల (Libra):(చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)వృత్తి, వ్యాపారాల్లో ఒకటి రెండు ఆర్థిక సమస్యలున్నా అధిగమిస్తారు. రాబడిక్రమంగా పెరుగు తుందే తప్ప తగ్గే అవకాశం లేదు. ఉద్యోగుల శక్తిసామర్థ్యాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుంచి ఆదరణపెరుగుతుంది. ఇష్టమైన మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. దైవ కార్యాల్లోపాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.ఆహార, విహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కుటుంబ జీవితంఅన్యోన్యంగా, సామరస్యంగా సాగిపోతుంది. వృశ్చికం(Scorpio):(విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. ఉద్యోగులకు కూడా మంచి అవకాశాలు అందివస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లోఆచితూచి అడు గేయడం మంచిది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. బంధువులతోచికాకులు తలెత్తు తాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. స్వల్పఅనారోగ్యానికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారం లభిస్తాయి.ఆశించిన శుభవార్తలు అందుతాయి.. ధనుస్సు(Sagittarius): (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)ఉద్యోగంలో పని ఒత్తిడి బాగా తగ్గుతుంది. హోదా మారే సూచనలున్నాయి. వృత్తి,వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితోకలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఒక శుభ కార్యంలో బంధుమిత్రులనుకలుసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. ఆరోగ్యంచాలావరకు కుదుటపడుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించేఅవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త అందుతుంది.. మకరం (Capricorn):(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) వృత్తి, వ్యాపారాలు నిలకడగా పురోగతి చెందుతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడిఉన్నప్పటికీ, ఫలితం ఉంటుంది. పెండింగు పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు.పెళ్లి ప్రయత్నం విషయంలో బంధు వుల నుంచి శుభవార్త అందుతుంది. కుటుంబంలోసుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. జీవిత భాగ స్వామితో కలిసి ఆలయాలుసందర్శిస్తారు. ఆర్థిక సమస్యలున్నా కొందరు బంధువులకు సహా యం చేస్తారు.అనుకోకుండా స్వల్ప అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.. కుంభం (Aquarius):(ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు కొద్దిగా తగ్గుతాయి. లావాదేవీలు,కార్యకలాపాలు పెరుగుతాయి. ఉద్యో గంలో బరువు బాధ్యతలు పెరిగి, విశ్రాంతికిదూరమవుతారు. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అన్యోన్యతపెరుగుతుంది. ముఖ్యమైన పనులన్నీ సకాలంలో పూర్తవు తాయి. ఇష్టమైన బంధువులరాకపోకలుంటాయి. కుటుంబ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. నిరుద్యోగులకుఉద్యోగం లభిస్తుంది. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బాగానేఉంటుంది.. మీనం(Pisces): (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. డబ్బు ఇవ్వడం,తీసుకోవడానికి సమ యం అనుకూలంగా లేదు. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, ఖర్చులుపెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు కొద్దిగా పెరుగుతాయి. ఏవిషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసు కోవద్దు. వీలైనంతగా ఆచితూచివ్యవహరించడం మంచిది. వ్యాపారాల్లో లాభాలు పరవాలేదని పిస్తాయి. కొందరుబంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.)
2024-07-04T21:15:30Z
వర్షాకాలంలో ఈ చిట్కాలు పాటిస్తే ఈగలు పరార్.. ఇంట్లోకి రమ్మన్నా రావు..
వర్షాకాలంలో వాతావరణం తేమగా, చిత్తడిగా ఉంటుంది. ఈ వెదర్ కండిషన్స్ ఈగలు, దోమలు, కీటకాలు వృద్ధి చెందడానికి అనుకూలంగా ఉంటాయి. వీటి కారణంగా అనేక రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ వ్యాధుల ముప్పు పెరుగుతుంది. అయితే ఇలాంటి కీటకాల నుంచి రక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకు 5 టిప్స్ బాగా పనిచేస్తాయి. అవేంటంటే.. పరిశుభ్రతవర్షాకాలంలో ఇళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో ఈగలు, ఇతర కీటకాలు ఎక్కువగా వస్తాయి. ఈగలు తేమ, చెత్త, ఆహారపు వైపు ఆకర్షితమవుతాయి. చెత్త మీద వాలిన ఈగలు ఆహారాలపై వాలడం వల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలు రావచ్చు. అందుకే హౌస్ క్లీన్గా ఉంచుకోవాలి. ఆహార పదార్థాలను చక్కగా స్టోర్ చేసుకోవాలి. ఇంట్లో ఎలాంటి తేమ, చెత్త లేకుండా చూసుకోవాలి. ఎంట్రన్స్ మూసేయడంఈగలు, కీటకాలు ఇంటిలోకి ప్రవేశించకుండా, ఎంట్రీ పాయింట్స్ గుర్తించి క్లోజ్ చేసుకోవాలి. చిన్న క్రాక్స్, గ్యాప్స్ నుంచి కూడా కీటకాలు ఇంట్లోకి రావచ్చు, కాబట్టి వాటిని కూడా క్లోజ్ చేయాలి. తలుపులు, కిటికీలు, ఎయిర్ వెంటిలేషన్ ఓపెనింగ్స్పై సన్నని జాలీలను అమర్చాలి. ఇంటి చుట్టూ ఉన్న ఖాళీలను సిలికాన్ సీలెంట్ లేదా ఇతర సీలింగ్ పదార్థాలతో మూసివేయాలి. నేచురల్ రిపెల్లెంట్స్ఇంట్లోకి ఈగలు, దోమలు, బొద్దింకలు రాకుండా సహజ కీటక నాశకాలను (Natural Repellents) వాడాలి. ఇందుకు విషపూరిత రసాయనాలను యూజ్ చేయకూడదు. కీటకాలను తిప్పికొట్టే సామర్థ్యం వేపనూనె సొంతం. నీమ్ ఆయిల్ను నీటిలో కలిపి కిటికీలు, తలుపులు, ఇతర ప్రాంతాల దగ్గర స్ప్రే చేయాలి. ఈగలు, దోమలు ఎక్కువగా కనిపించే ప్రదేశాలలో నిమ్మకాయ ముక్కలు, లవంగాలు కలిపి ఉంచినా ఫలితం ఉంటుంది. పుదీనా, లావెండర్, యూకలిప్టస్ వంటి ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా కీటకాలను దూరంగా ఉంచగలవు. క్లీనింగ్ఇంటి బయట ఎంత చెత్తగా ఉంటే ఇంట్లోకి అంత ఎక్కువగా ఈగలు దోమలు రావచ్చు. అందుకే ఇంటి ముందు, వెనుక, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను క్లీన్ చేసుకోవాలి. ఏదైనా పాత్రలలో లేదంటే గుంతలలో నీరు నిలిచి ఉంటే వాటిని తొలగించాలి. లేదంటే ఈ నీటిలో దోమలు పెరుగుతాయి. పూల కుండీలు, ఖాళీ డబ్బాలు, రెయిన్ వాటర్ స్టోర్ అయ్యే ఇతర వస్తువులను ఖాళీ చేయాలి. ఈ సీజన్లో తెల్లటి బయటి లైట్లకు బదులుగా పసుపు లైట్లను వాడండి. పసుపు లైట్లు తక్కువ కీటకాలను ఆకర్షిస్తాయి, అందువల్ల బయటి కీటకాలు ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉండదు. ఫ్లై ట్రాప్స్ఇంట్లో ఈగలు, ఇతర కీటకాలను పట్టుకోవడానికి, తొలగించడానికి ఫ్లై ట్రాప్స్ (Fly Traps) వాడాలి. వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక జాడీలో కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్, డిష్ సోప్ కలపాలి. వెనిగర్ ఈగలను ఆకర్షిస్తుంది, కానీ సోప్ సర్ఫేస్ టెన్షన్ను నాశనం చేస్తుంది. ఫలితంగా ఈగలు ఈ లిక్విడ్లో మునిగి చనిపోతాయి. (Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ అంచనాల ఆధారంగా రూపొందించబడింది. news18 Telugu ఇదే విషయాన్ని ధృవీకరించలేదు. దయచేసి వాటిని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి)
2024-07-03T02:23:38Z
ఈ కూరగాయలు సాగు చేస్తే.. లాభాలతో లక్షాధికారులు కావచ్చు
వ్వవసాయం, వ్యాపారం ఏదైనా లాభం బాగా వచ్చే దాని కోసం అందరూ అన్వేషిస్తారు. అలాంటి వాళ్లకు ఇది మంచి లాభసాటి సాగుతో పాటు వ్యాపారంగా చూడవచ్చు. గ్రామాల నుంచి నగరాల్లో కూడా వాణిజ్య పంటలను పండించడం ద్వారా మీరు ఇంట్లోనే లక్షలాది రూపాయలు సంపాదించవచ్చు. ఈ రోజుల్లో విద్యావంతులు కూడా లక్షల రూపాయల ఉద్యోగాలు వదిలి తమ ఆలోచనలతో పాటు ఆధునిక పద్దతులను అనుసరించి వ్యవసాయం వైపు చూపు మళ్లించుకుంటున్నారు. కొన్ని వాణిజ్య పంటలను పండిస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. బెండ సాగుతో బంపర్ లాభాలు పొందవచ్చు. ఈ కూరగాయల సాగు ఆర్థికంగా చాలా లాభదాయకంగా ఉంది. భూమి తక్కువగా ఉంటే, కూరగాయల సాగు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. తక్కువ భూమిలో ఎక్కువ చెట్లు వేసి దిగుబడి పొందవచ్చు.తద్వారా వాణిజ్య పంటలలో ఊహించని లాభాలు పొందవచ్చు. విత్తడం ఎలా?: బిందెలు విత్తే ముందు దాని గురించి సరిగ్గా తెలుసుకోవడం అవసరం. తద్వారా ఉత్పత్తి బాగుంటుంది. పంక్తుల మధ్య కనీసం 40-45 సెంటీమీటర్ల దూరం ఉండాలి. విత్తనాలను 3 సెంటీమీటర్ల కంటే ఎక్కువ లోతులో నాటకూడదు. మొత్తం పొలాన్ని తగిన ఆకారంలో స్ట్రిప్స్గా విభజించాలి. ఇది నీటిపారుదలని సులభతరం చేస్తుంది. హెక్టారుకు 15 నుంచి 20 టన్నుల ఎరువు అవసరం. నిందలు కూడా ఎప్పటికప్పుడు చేయాలి. తద్వారా ఎక్కువ దిగుబడి పొందవచ్చు. బెండకాయలతో ఆరోగ్యానికి మేలు:సమాచారం ప్రకారం బెండకాయలు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది క్యాన్సర్తో పోరాడటానికి సహాయపడుతుంది. అలాగే గుండె సంబంధిత వ్యాధులను కూడా దూరం చేస్తుంది. డయాబెటిక్ పేషెంట్లు కూడా బిండా తినాలి. అంతే కాకుండా మెంతికూర తినడం వల్ల రక్తహీనతలో కూడా మేలు జరుగుతుంది. ఎంత సంపాదిస్తారు?:బెండకాయ సాగును సక్రమంగా సాగు చేస్తే 1 ఎకరం 5 లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు. ఇందులో ఖర్చులు తీసివేస్తే కనీసం 3.5 లక్షల రూపాయలు ఆదా అవుతాయి. బెండ సీజన్లో మంచి ధరలను పొందుతుంది. సమాచారం ప్రకారం జార్ఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, అస్సాం , మహారాష్ట్రలు బెండకాయలను సాగు చేస్తున్న ప్రధాన రాష్ట్రాలు. ఇది కాకుండా హర్యానా ,రాజస్థాన్లలో కూడా దీనిని సాగు చేస్తున్నారు. (Disclaimer: ఇక్కడ అందించిన వ్యవసాయానికి సంబంధించిన సమాచారం సాధారణ సమాచారాన్ని మాత్రమే సూచిస్తుంది. News 18 దాని నిర్వహణ దీనికి బాధ్యత వహించదు. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు, దయచేసి మీ విచక్షణను ఉపయోగించండి. నిపుణుల మార్గదర్శకత్వం తీసుకోండి.)
2024-07-04T05:28:16Z
కళ్లు ఎన్ని రంగులు ఉంటాయో తెలుసా.. ఏవి ఆకర్షణీయంగా ఉంటాయంటే..!
మనుసులో ఉన్నది కళ్లలో కనిపిస్తుందని అంటుంటారు. మనలోని భావాల్ని కళ్లు ప్రదర్శిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేనా మనలో ఆకర్షణీయంగా కనిపించే భాగాల్లో కళ్లు మొదటి స్థానంలో ఉంటాయి. అయితే ప్రపంచంలో కేవలం నలుపు రంగు, నీలికళ్లే కాదు.. ఇంకా చాలా రంగుల కళ్లు ఉన్నాయంట. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది కనుపాపలు నలుపు రంగులో ఉంటాయి. నిజానికి అది నలుపు కాదు.. గోధుమ రంగు. మెలనిన్ అనే వర్ణద్రవ్యం ఎక్కువగా ఉన్నవాళ్ల కళ్లు నలుపుగా కనిపిస్తాయి. దాదాపు 70 నుంచి 79 శాతం ప్రజలకు ఈ గోధుమ రంగు కళ్లే ఉన్నాయి. ఆఫ్రికా, తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా వాసులకు ముదురు గోధుమ రంగు కళ్లు.. దక్షిణాసియా, అమెరికా, యూరప్ ప్రజలకు లేత గోధుమ రంగు కళ్లు ఎక్కువగా ఉంటాయట. ప్రపంచంలో 8 నుంచి 10 శాతం మందికి నీలిరంగు కళ్లు ఉంటాయి. యూరప్లో అందులో ముఖ్యంగా స్కాండినేవియాలో వీళ్లు అధికం. కొన్ని వేల సంవత్సరాల కిందట అందరికీ గోధుమ రంగు కళ్లే ఉండేవట. ఆ తర్వాత మనుషుల జన్యువుల్లో మార్పులు వచ్చి, కనుపాప రంగు మారింది. కనుపాప రంగు పాక్షికంగా తల్లిదండ్రుల జన్యువు నుంచి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. నీలిరంగు కళ్లున్న వ్యక్తులు చీకటిలోనూ చూడగలరట. అయితే పగటి పూట సూర్యకాంతిని తట్టుకోలేరని నిపుణులు చెబుతున్నారు. ఆకుపచ్చ, నారింజ, బంగారు వర్ణాల కలయికతో లేత గోధుమ రంగు ఉంటుంది. ఇలాంటి కళ్లున్నవారు ప్రపంచవ్యాప్తంగా 5 శాతం మంది ఉన్నారు. ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలు, బ్రెజిల్, స్పానిష్ ప్రజలకు ఈ రంగు కళ్లు ఎక్కువగా ఉంటాయట. పిల్లులకు ఉండే బూడిదరంగు కళ్లు ప్రపంచంలో 3 శాతం మనుషులకు ఉంటాయి. కనుపాప రంగుకు కారణమయ్యే మెలనిన్ అనే వర్ణద్రవ్యం తక్కువ మొత్తం ఉండటం, కంటిలోని స్ట్రోమా భాగంలో కొలాజిన్ ప్రొటీన్ ఎక్కువగా ఉండటంతో కనుపాప నీలిరంగులోకి మారకుండా అడ్డంకి ఏర్పడుతుందట. ఫలితంగా కనుపాప బూడిద రంగులో కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగు కళ్లున్నవాళ్లు ఎక్కువగా ఉత్తర, తూర్పు యూరప్లో ఉంటారు. ప్రపంచ జనాభాలో 2శాతం మంది కళ్లు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఉత్తర, మధ్య, పశ్చిమ యూరప్లో ఆకుపచ్చ కళ్లు ఉన్న వ్యక్తులు ఎక్కువ. వీరిలో 16 శాతం సెల్టిక్, జర్మన్ల వారసులై ఉంటారని అంచనా. ఐర్లాండ్, స్కాట్లాండ్లో 86 శాతం మంది నీలి, ఆకుపచ్చ రంగు కళ్లున్నవారు ఉన్నారు.
2024-07-04T10:59:00Z
Hair Oiling : తలకు నూనె రాయటం అవసరమా.. ఆ తప్పు చేస్తే జుట్టు రాలిపోతుందా..?
రోజూ తలకు నూనె రాసుకోమని పెద్దలు సూచిస్తుంటారు. అయితే ఇప్పుడు తలకు నూనె లేకుండా తిరగటం ఫ్యాషన్ అయిపోంది. చాలా మంది తలకు నూనె పెట్టుకోవడం పూర్తిగా మానేశారు. దాని వల్ల జుట్టు రాలిపోవటం, చుండ్రు, కుదుళ్ళు బలహీనంగా మారటం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆయుర్వేదం జుట్టుకు నూనె రాయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నట్లు స్పష్టం చేస్తుంది. జుట్టుకు ఆయిల్ పూసి మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. జుట్టుకు బలం చేకూరుతుంది. బాడీ మసాజ్ లేదా హాట్ ఆయిల్ మసాజ్ రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడినట్లే తలలోని మూలాలను బలపరిచేందుకు తలకు నూనె రాయటం అవసరం. దీని వల్ల జుట్టు రాలడం, తెల్లగా మారటం, చుండ్రు వంటి అనేక రకాల సమస్యలను నయం చేయవచ్చు. చాలా మంది నూనె రాసుకోవడాన్ని నిర్లక్ష్యం చేస్తారు. వాస్తవానికి జుట్టుకు నూనె రాయడం అన్నది చాలా ముఖ్యం. నూనెతో జుట్టును సున్నితంగా మసాజ్ చేయడం వల్ల జుట్టు మదృువుగా మారుతుంది. అంతేకాకుండా తేమను పెంచుతుంది. జుట్టుకు మంచి మెరుపు సంతరించుకుంటుంది. నూనె రాయడం వల్ల జుట్టు పొడిబారకుండా ఉండి జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టు పొడిగా ఉండి చిట్లి పోతుంటే వారానికి మూడుసార్లు జుట్టుకు నూనె రాయడం జుట్టుకు బలం చేకూరుతుంది. దీంతో జుట్టు చిట్లకుండా ఉంటుంది. నూనె రాయటం వల్ల జుట్టు మెరిసేలా.. ఒత్తుగా కనిపించేలా చేస్తుంది. కొబ్బరి, ఆలివ్, నువ్వులు, బాదం, అర్గాన్, బృంగరాజ్, ఉసిరి వంటి సాధారణంగా ఉపయోగించే కొన్ని నూనెలు జుట్టు రాలడం, చుండ్రు, చిట్లిపోవడం, నెరవడం వంటి మొదలైన సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయి. పలు రకాల నూనెలు వివిధ విటమిన్లను కలిగి ఉంటాయి. ఈ నూనెలను నేరుగా పూయడంతో, జుట్టు కుదుళ్ళు బలపడతాయి. జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతిరోజూ నూనెను తప్పక రాయాలి. రోజు రాసుకోవటం కుదరకపోతే కనీసం వారానికి రెండుసార్లు జుట్టుకు నూనె రాయాలి. రాత్రి నిద్రకు ముందు తలకు నూనె బాగా పట్టించి ఉదయం తలస్నానం చేయటం వల్ల జుట్టుకు మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయటం వల్ల తలలో చుండ్రు తగ్గుతుంది. జుట్టు కూడా పెరుగుతుంది. నూనెల్లో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి జుట్టులోని లిపిడ్లను భర్తీ చేయడంలో సహాయపడతాయి. జుట్టు ఆరోగ్యంగా కనిపించేలా చేయడంలో లిపిడ్లు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. లిపిడ్లు వల్ల జుట్టు మెరవటంతోపాటు.. అందంగా ఉంటుంది. అయితే కొన్ని రకాల నూనెలు అలెర్జీని కలిగిస్తాయి. వాటిని రాసే ముందు ముందుగా కొద్దిగా రాసి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేవని నిర్దారించుకోవాలి. ఆతరువాతనే వాటిని ఉపయోగించాలి. (గమనిక : ఈ సమాచారం అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా సేకరించినది.. కేవలం అవగాహన కోసం మాత్రమే రాసినది. ఆచరించే ముందు వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది.
2024-07-03T14:10:52Z
బేబీకార్న్ కుర్కురే
ఎనిమిది, శనగపిండి: రెండు టేబుల్ స్పూన్లు, బియ్యపు పిండి/కార్న్ఫ్లోర్: రెండు టేబుల్ స్పూన్లు, కారం: రెండు టీస్పూన్లు, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్: ఒక టీస్పూన్ చొప్పున, గరంమసాలా: అర టీస్పూన్, వేయించిన జీలకర్ర పొడి: అర టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా.
2024-07-04T19:12:28Z
Panchangam Today: ఈ రోజు అలాంటి పనులకు అసలు మంచిది కాదు
నేడు 5 జులై 2024 బుధవారం, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, జ్యేష్ట మాసం, బహుళ పక్షం.మాసశివరాత్రి ఇవాళ 5 గంటల 35 నిమిషాలకు సూర్యోదయం. నేడు సాయంత్రం 6 గంటల 37 నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది. ఇవాళ తిథి బహుళ త్రయోదశీ. ఉదయం 5 గంటల .54 నిమిషాల వరకు కలదు. చతుర్దశి రాత్రి అనగా తెల్లవారుజామున :4 గంటల .58నిమిషాల వరకు తదుపరి: అమావస్య . వారం: బృహస్పతివాసరె నక్షత్రం: మృగశిర రా:3గంటల 54నిమిషాల వరకు తదుపరి: ఆర్ధ్ర.యోగం: గండ ,ఉదయం 6గంటల 59నిమిషాల వరకు. ఉదయం 9 గంటల 1 నిమిషం వరకూ. వృద్ది రాత్రి అనగా తెల్లవారు జామున 5గంటల .13నిమిషాల వరకు. తదుపరి: దృవ .కరణం:వణిజ ఉదయం 5గంటల 54నిమిషాల వరకు తర్వాత భద్ర సాయంత్రం 5గంటల 26నిమిషాల వరకు. తదుపరి శకుని రాత్రి తెల్లవారుజామున :4గంటల 58నిమిషాల వరకు.తదుపరి:చతుష్పాత్ అమృతకాలం రాత్రి 7గంటల 11నిమిషాల నుండి 8గంటల 46నిమిషాల వరకు ఉంది. నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు. దుర్ముహూర్తం ఉదయం 10గంటల 10నిమిషాల నుండి 11గంటల 2నిమిషాల వరకు. తిరిగిమధ్యాహ్నం:3గంటల 23నిమిషాల నుండి 4గంటల 15నిమిషాల వరకు కలదు. ఇది మంచి ముహూర్తం కాదు. అందువల్ల ఎవరూ ఈ సమయంలో ముహూర్తాలు పెట్టుకోరు. రాహుకాలం మధ్యాహ్నం :ఒంటి గంట 30నిమిషాల నుండి 3గంటల వరకు ఉంది. రాహుకాల సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయరు. యమ గండకాలం ఉదయం :06 గంటల నుండి 7గంటల 30నిమిషాల వరకు ఉంది. ఈ యమగండ కాలాన్ని శుభ సమయంగా పరిగణించరు. యమగండాన్నే కేతుకాలం అని కూడా అంటారు. అన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఈ రోజు వర్జ్యం ఉదయం 9గంటల 40నిమిషాల నుండి 11గంటల 15నిమిషాల వరకు కలదు ఉంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.
2024-07-04T21:45:38Z