ఈ వాసనలకు పాములు సుస్సు పోసుకుంటాయి.. నాగలోకంలో ఉన్నా అవి మీ దగ్గరకు రావు..!
ఎండవేడిమి నుండి ఉపశమనం కోసం ప్రజలు వర్షాకాలాన్ని చాలా ఇష్టపడతారు. అయితే, ఈ సీజన్ ఉపశమనంతో పాటు అనేక సమస్యలను కూడా తెస్తుంది. దీనివల్ల నీటి వల్ల వచ్చే వ్యాధులు, ఫుడ్ పాయిజనింగ్, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉండటమే కాకుండా.. పాములు, తేళ్లు, జర్రిలు మొదలైన కొన్ని చాలా ప్రమాదకరమైన జీవులు ఇంట్లోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గ్రామాలు, కొండ ప్రాంతాలు లేదా అటవీ ప్రాంతాలు మరియు గ్రౌండ్ ఫ్లోర్లో నివసించే వారు ఎంతో ప్రమాదంలో ఉన్నట్టే. అటువంటి పరిస్థితిలో ప్రమాదాన్ని నివారించడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి. వర్షాకాలంలో పాములు, కీటకాలను ఇంటి నుండి దూరంగా ఉంచడానికి 10 మార్గాలను తెలుసుకుందాం. ముఖ్యంగా మీరు గ్రౌండ్ ఫ్లోర్లో నివసిస్తుంటే, మీ ఇల్లు కొండ ప్రాంతంలో లేదా అడవి, పార్క్ మొదలైన వాటికి సమీపంలో ఉంటే.. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షం పడితే తలుపులు, కిటికీలు మూసేయాలి. ఎందుకంటే పాములు ఈ ప్రదేశాల్లో ఎక్కవ సంచరిస్తుంటాయి. పాములంటే ప్రజల్లో భయం నెలకొంది. అందరూ పాములకు దూరంగా ఉండాలని కోరుకుంటారు, అయితే పాములను సురక్షితంగా తరిమివేయడం ఎలా.. పాములను పారిపోయేలా చేసే వాసన ఈ ప్రపంచంలో ఏదైనా ఉందా అంటే సమాధానం అవుననే వస్తుంది. పాములను తరిమిమీరు వేప నూనెను ఉపయోగించవచ్చు. వేపనూనెను నీళ్లలో కలిపి రోజూ ఇంటింటా స్ప్రే చేస్తే దోమదోషాలు తొలగిపోతాయి. ఇంటి తోటలో కూడా ఈ నీటిని పిచికారీ చేస్తూ ఉండండి. పాములను లేదా ఇతర జంతువులను మీ ఇంటికి దూరంగా ఉంచడానికి బ్లీచింగ్ పౌడర్ని ఉపయోగించవచ్చు. బయట మరియు తోటలో నిలబడి ఉన్న నీటిపై పిచికారీ చేయండి. ఈ నీటితో ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు. కావాలంటే దాల్చిన చెక్క పొడి, వైట్ వెనిగర్ లేదా నిమ్మరసం కలిపి ఇంటి బయట పిచికారీ చేసుకోవచ్చు. పాములు వచ్చే అవకాశం ఉన్న ప్రదేశాలలో క్రమం తప్పకుండా పిచికారీ చేయాలి. పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే కిటికీలకు, తలుపులకు ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలను రాయండి. చాలా పాములు ఈవాసన చూసి పారిపోతుంటాయి. మీ ఇంటి తోటలో వెల్లుల్లి మరియు ఉల్లిపాయలను నాటడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. పాములు కొన్ని మొక్కలకు కూడా భయపడతాయి, అవి పారిపోతాయి. కాక్టస్, స్నేక్ ప్లాంట్, తులసి చెట్టు, నిమ్మ గడ్డి మొదలైనవి వర్షాకాలంలో తప్పనిసరిగా నాటాలి. ఇంటి ప్రధాన ద్వారం, కిటికీల దగ్గర ఈ మొక్కలను ఉంచాలి. ఈ మొక్కల వాసన కారణంగా, పాములు ఇంటి దగ్గరికి రావు. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది.. న్యూస్ 18 తెలుగు దీనిని ధృవీకరించడం లేదు.)
2024-07-07T07:55:36Z
బ్రహ్మముడికి అంటే ఏమిటి? దానికి అంత ప్రాముఖ్యత ఉందా!
హిందువులు వివాహ వేడుకలలో అనేక ఆచారాలు, సంప్రదాయాలతో పాటిస్తుంటారు. తాళిబొట్టు కట్టడం, మెట్టెలు పెట్టడం, ఏడడుగులు నడవడం వంటి సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ ఆచారాల ద్వారా ఇద్దరు వ్యక్తులు పవిత్రమైన అనుబంధంలోకి అడుగు పెడతారు. హిందూ వివాహాల్లో అలాంటి ఒక ముఖ్యమైన సంప్రదాయం బ్రహ్మముడి (గత్బంధన్). ఈ ఆచారంలో వధువు దుపట్టాను వరుడు ధరించే పింక్ స్కార్ఫ్/కండువా/పంచెతో కలిపి ముడి వేస్తారు. ఇది వారి ఐక్యతను సూచిస్తుంది. జీవితాంతం కలిసి ఉండాలనే కోరికను సూచిస్తుంది. బ్రహ్మముడి ప్రాముఖ్యత : బ్రహ్మముడి అనేది జీవితాన్ని కలిసి గడపాలని నిర్ణయించుకున్న ఇద్దరి వ్యక్తుల మధ్య ఏర్పడిన పవిత్రమైన బంధానికి సింబల్గా నిలుస్తుంది. ఈ ఆచారంలో వరుడి కండువా (పొడవైన స్కార్ఫ్), మహిళ దుపట్టాను ఒక పవిత్రమైన దారంతో కలిపి ముడి వేస్తారు. ఈ ముడి ద్వారా తాము లైఫ్ లాంగ్ ఒకటిగా ఉంటామని వధూవరులు ప్రమాణం చేస్తారు. దీని ద్వారా ఒకరినొకరు గౌరవించుకుంటామని, ప్రేమించుకుంటామని కూడా ప్రామిస్ చేస్తారు. ఒక యువకుడు, ఒక యువతి ఒకరితో ఒకరు జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆ బంధాన్ని పవిత్రంగా గుర్తించడానికి ఒక ముడిని కడతారు. ఇది వధూవరుల మధ్య జీవితాంతం నెలకొనే అవినాభావ బంధాన్ని సూచిస్తుంది. హిందూ వివాహాల్లో బ్రహ్మముడి : హిందూ వివాహంలో, వరుడి సోదరి బ్రహ్మముడిని కడుతుంది. ఈ ముడి ద్వారా వధువును కొత్త కుటుంబ సభ్యురాలిగా అంగీకరిస్తున్నామని వరుడు, అతడి కుటుంబ సభ్యులు తెలియజేస్తారు. పెళ్లిలో వధూవరులు తమ మెడల చుట్టూ కండువాలను మార్చుకోవడం ఒక ముఖ్యమైన ఆచారం. ఈ స్కార్ఫ్స్ వారి మధ్య ఏర్పడిన శాశ్వత బంధాన్ని సూచిస్తాయి. వరుడు తన భార్యకు కండువాను బహుమతిగా ఇవ్వడం ద్వారా, ఆమెను తన జీవితంలో ఒక భాగంగా స్వీకరిస్తానని, ఎల్లప్పుడూ రక్షిస్తానని, ఆమెను ప్రేమిస్తానని వాగ్దానం చేస్తాడు. వధువు తన భర్తకు తన స్కార్ఫ్ను బహుమతిగా ఇవ్వడం ద్వారా, అతడిని గౌరవిస్తానని, అతడికి విధేయురాలిగా ఉంటానని, అతనితో కలిసి జీవితాన్ని పంచుకుంటానని వాగ్దానం చేస్తుంది. మరణం వరకు ఒకరినొకరు ప్రేమించుకోవడానికి, గౌరవించుకోవడానికి, మద్దతు ఇవ్వడానికి వారు ప్రమాణం కూడా చేస్తారు. ఈ ఆచారం జరిగిన తర్వాత, కొత్త దంపతులు తాము మానసికంగా, భావోద్వేగపరంగా, శారీరకంగా ఒకరితో ఒకరు కలిసి ఉంటామని నమ్ముతారు. ఇది ఒకే ఆత్మగా మారిన ఇద్దరి వ్యక్తుల సంబంధాన్ని సూచిస్తుంది. బ్రహ్మముడి ద్వారా, వధూవరులు తమ ఆనందాలు, బాధలు, ఆస్తులు, బాధ్యతలను పంచుకునే జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంటారు. బ్రహ్మముడి సమయంలో వరుడి పొడవైన కండువాకు ఐదు పవిత్ర వస్తువులు జోడిస్తారు. అవి నాణెం, పువ్వు, బియ్యం, పసుపు, దుర్వా గడ్డి. ఈ వస్తువులు వారి జీవితంలో సంతోషం, శ్రేయస్సు, సమృద్ధిని సూచిస్తాయి. నాణెం డబ్బుపై ప్రతి ఒక్కరికీ సమాన హక్కు ఉందని, అందరి అవసరాలకు అనుగుణంగా దానిని ఉపయోగించాలని సూచిస్తుంది. పూలు, వధూవరులు ఒకరితో ఒకరు సంతృప్తిగా ఉంటారని సూచిస్తాయి. పసుపు, వధూవరులు ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారని సూచిస్తుంది. దుర్వా గడ్డిలాగా వధూవరులు ఇద్దరూ చిర యువ, ఉత్సాహంగా ఉండాలని సూచిస్తుంది. బియ్యం , జంటలో ఎవరూ ఆకలితో బాధపడకుండా ఉండేంతగా తినాలని సూచిస్తుంది. మూడు ముడులు : బ్రహ్మముడిలో మూడు ముడుల్లో ప్రతి ముడికి ఓ ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. మొదటి ముడి హక్కులను సూచిస్తుంది. దంపతులు ఒకరిపై ఒకరు హక్కులు కలిగి ఉంటారని ఈ ముడి అర్థం. రెండో ముడి బంధాన్ని తెలియజేస్తుంది. మూడో ముడి, ప్రపంచాన్ని సూచిస్తుంది. ప్రపంచంలోని అందరినీ గౌరవించాలని ఈ ముడి తెలుపుతుంది. అగ్ని దేవుడు పవిత్రత, శక్తికి చిహ్నం. కొత్త దంపతులు అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా, దేవుడి ఆశీర్వాదాన్ని కోరుకుంటారు.
2024-07-05T13:03:08Z