బ్రహ్మముడికి అంటే ఏమిటి? దానికి అంత ప్రాముఖ్యత ఉందా!
హిందువులు వివాహ వేడుకలలో అనేక ఆచారాలు, సంప్రదాయాలతో పాటిస్తుంటారు. తాళిబొట్టు కట్టడం, మెట్టెలు పెట్టడం, ఏడడుగులు నడవడం వంటి సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ ఆచారాల ద్వారా ఇద్దరు వ్యక్తులు పవిత్రమైన అనుబంధంలోకి అడుగు పెడతారు. హిందూ వివాహాల్లో అలాంటి ఒక ముఖ్యమైన సంప్రదాయం బ్రహ్మముడి (గత్బంధన్). ఈ ఆచారంలో వధువు దుపట్టాను వరుడు ధరించే పింక్ స్కార్ఫ్/కండువా/పంచెతో కలిపి ముడి వేస్తారు. ఇది వారి ఐక్యతను సూచిస్తుంది. జీవితాంతం కలిసి ఉండాలనే కోరికను సూచిస్తుంది. బ్రహ్మముడి ప్రాముఖ్యత : బ్రహ్మముడి అనేది జీవితాన్ని కలిసి గడపాలని నిర్ణయించుకున్న ఇద్దరి వ్యక్తుల మధ్య ఏర్పడిన పవిత్రమైన బంధానికి సింబల్గా నిలుస్తుంది. ఈ ఆచారంలో వరుడి కండువా (పొడవైన స్కార్ఫ్), మహిళ దుపట్టాను ఒక పవిత్రమైన దారంతో కలిపి ముడి వేస్తారు. ఈ ముడి ద్వారా తాము లైఫ్ లాంగ్ ఒకటిగా ఉంటామని వధూవరులు ప్రమాణం చేస్తారు. దీని ద్వారా ఒకరినొకరు గౌరవించుకుంటామని, ప్రేమించుకుంటామని కూడా ప్రామిస్ చేస్తారు. ఒక యువకుడు, ఒక యువతి ఒకరితో ఒకరు జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆ బంధాన్ని పవిత్రంగా గుర్తించడానికి ఒక ముడిని కడతారు. ఇది వధూవరుల మధ్య జీవితాంతం నెలకొనే అవినాభావ బంధాన్ని సూచిస్తుంది. హిందూ వివాహాల్లో బ్రహ్మముడి : హిందూ వివాహంలో, వరుడి సోదరి బ్రహ్మముడిని కడుతుంది. ఈ ముడి ద్వారా వధువును కొత్త కుటుంబ సభ్యురాలిగా అంగీకరిస్తున్నామని వరుడు, అతడి కుటుంబ సభ్యులు తెలియజేస్తారు. పెళ్లిలో వధూవరులు తమ మెడల చుట్టూ కండువాలను మార్చుకోవడం ఒక ముఖ్యమైన ఆచారం. ఈ స్కార్ఫ్స్ వారి మధ్య ఏర్పడిన శాశ్వత బంధాన్ని సూచిస్తాయి. వరుడు తన భార్యకు కండువాను బహుమతిగా ఇవ్వడం ద్వారా, ఆమెను తన జీవితంలో ఒక భాగంగా స్వీకరిస్తానని, ఎల్లప్పుడూ రక్షిస్తానని, ఆమెను ప్రేమిస్తానని వాగ్దానం చేస్తాడు. వధువు తన భర్తకు తన స్కార్ఫ్ను బహుమతిగా ఇవ్వడం ద్వారా, అతడిని గౌరవిస్తానని, అతడికి విధేయురాలిగా ఉంటానని, అతనితో కలిసి జీవితాన్ని పంచుకుంటానని వాగ్దానం చేస్తుంది. మరణం వరకు ఒకరినొకరు ప్రేమించుకోవడానికి, గౌరవించుకోవడానికి, మద్దతు ఇవ్వడానికి వారు ప్రమాణం కూడా చేస్తారు. ఈ ఆచారం జరిగిన తర్వాత, కొత్త దంపతులు తాము మానసికంగా, భావోద్వేగపరంగా, శారీరకంగా ఒకరితో ఒకరు కలిసి ఉంటామని నమ్ముతారు. ఇది ఒకే ఆత్మగా మారిన ఇద్దరి వ్యక్తుల సంబంధాన్ని సూచిస్తుంది. బ్రహ్మముడి ద్వారా, వధూవరులు తమ ఆనందాలు, బాధలు, ఆస్తులు, బాధ్యతలను పంచుకునే జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంటారు. బ్రహ్మముడి సమయంలో వరుడి పొడవైన కండువాకు ఐదు పవిత్ర వస్తువులు జోడిస్తారు. అవి నాణెం, పువ్వు, బియ్యం, పసుపు, దుర్వా గడ్డి. ఈ వస్తువులు వారి జీవితంలో సంతోషం, శ్రేయస్సు, సమృద్ధిని సూచిస్తాయి. నాణెం డబ్బుపై ప్రతి ఒక్కరికీ సమాన హక్కు ఉందని, అందరి అవసరాలకు అనుగుణంగా దానిని ఉపయోగించాలని సూచిస్తుంది. పూలు, వధూవరులు ఒకరితో ఒకరు సంతృప్తిగా ఉంటారని సూచిస్తాయి. పసుపు, వధూవరులు ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారని సూచిస్తుంది. దుర్వా గడ్డిలాగా వధూవరులు ఇద్దరూ చిర యువ, ఉత్సాహంగా ఉండాలని సూచిస్తుంది. బియ్యం , జంటలో ఎవరూ ఆకలితో బాధపడకుండా ఉండేంతగా తినాలని సూచిస్తుంది. మూడు ముడులు : బ్రహ్మముడిలో మూడు ముడుల్లో ప్రతి ముడికి ఓ ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. మొదటి ముడి హక్కులను సూచిస్తుంది. దంపతులు ఒకరిపై ఒకరు హక్కులు కలిగి ఉంటారని ఈ ముడి అర్థం. రెండో ముడి బంధాన్ని తెలియజేస్తుంది. మూడో ముడి, ప్రపంచాన్ని సూచిస్తుంది. ప్రపంచంలోని అందరినీ గౌరవించాలని ఈ ముడి తెలుపుతుంది. అగ్ని దేవుడు పవిత్రత, శక్తికి చిహ్నం. కొత్త దంపతులు అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా, దేవుడి ఆశీర్వాదాన్ని కోరుకుంటారు.
2024-07-05T13:03:08Z
Nice Idea: మిద్దెపై తోట.. ఈ స్కూల్ కరెస్పాండెంట్ ఐడియా అదుర్స్..
ఏ ఒక్క ఆహార పదార్థాలు కూరగాయలు కొనాలన్న భయం. ఎటు చూసినా రసాయనాలతో పాటు కాలుష్యంతో కూడిన వాతావరణం, (కూరగాయలు) ఆహార పదార్థాలు నిత్యం తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. వీటిఫలితంగా అనారోగ్యంతో పాటు అనేక ప్రాణాంతక రోగాలను కొని తెచ్చుకుంటున్నామని వైద్యులు చెబుతున్నారు. కొంత కాలంగా వ్యవసాయ రంగంలో కూరగాయల సాగులో కొంత మార్పు కనిపిస్తోందనే చెప్పాలి. రైతన్నలు సైతం సేంద్రియ పంటల వైపు మొగ్గుచూపుతున్నారని వ్యవసాయ శాఖ అధికారులు కూడా చెబుతున్నారు. మరికొందరు గృహిణులు, విద్యావంతురాలు, మహిళలు సుందరమైన ఇంటి చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆరోగ్యమైన జీవితాన్ని ప్రతిఒక్కరూ కోరుకుంటారు.. ఇష్టపడతారు ఆస్వాదిస్తారని చెప్పాలి. అందులో భాగంగానే మహా నగరాల్లో, పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా మహిళమణులు (మిద్దె తోటలను)బంగ్లా పై సాగు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఆలోచింపజేస్తున్నారు. ఖాళీగా ఉన్న మిద్దెపై రూఫ్ గార్డెన్ లను ఏర్పాటు చేసి పండ్లు, పూలు, వెజిటేబుల్స్ (కూరగాయలు) పండిస్తున్నారు. ఎలాంటి రసాయన ఎరువులను వినియోగించకుండా కేవలం సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తూ..ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పద్మనగర్ లో ఓ ప్రైవేటు స్కూల్ కరస్పాండెంట్ బుర్ర రాధాకృష్ణ ప్రసాద్ గౌడ్ తమ ఇంటిపై మిద్దె తోటను ఏర్పాటు చేసి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారనే చెప్పవచ్చు. మిద్దెతోటల సాగుపై రోజురోజుకు పట్టణ ప్రజల్లో ఆసక్తి పెరుగుతుందనే చెప్పాలి. ఎందుకంటే గతంలో మనం కూడా చాలా వరకు మహానగరాల్లో ఇలాంటి వార్తా కథనాలను చూసాం. రసాయనాలతో పండించిన పంటలు అనారోగ్యాలకు గురిచేస్తున్నాయని, ఈ సమస్యకు మిద్దె తోటలే పరిష్కారమని సిరిసిల్ల పట్టణం పద్మానగర్ కు చెందిన బుర్ర రాధాకృష్ణ ప్రసాద్ గౌడ్ భావించామని లోకల్18కి తెలిపారు. తమకి కావల్సిన వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఇంటి మేడపైన పండించవచ్చునని, గత రెండు సంవత్సరాల క్రితమే మిద్దె తోట సాగును ప్రారంభించామని, కరోనా మహమ్మారి విపత్తు విజృంభించిన సందర్భంలో తనకు దొరికిన విలువైన సమయాన్ని బంగ్లా పై( మిద్దెతోట సాగుకు) ఉపయోగించుకున్నట్లు చెప్పారు.ఈ క్రమంలో తన ఇంట్లోకి కావలసిన నాణ్యమైన తాజా ఆకుకూరలు,కూరగాయలు,పండ్లు సాగు చేస్తుండడంతో ఆరోగ్యంతో పాటు ఆహ్లాదాన్ని పొందుతున్నారనే చెప్పాలి. ఆమె తమకున్న కొద్దిపాటి టెర్రస్ పై ఏర్పాటు చేసిన గార్డెన్లో ఇప్పుడు బీర, సొర, కాకర, టమాటా, బెండ, పచ్చిమిర్చి, వంకాయ, మునగ, చామగడ్డ, దొండ , చిక్కుడు తదితర కూరగాయలతోపాటు.. బచ్చలి కూర, పాలకూర, చుక్కకూర, మెంతి, పుదీనా, కొత్తిమీర, గోంగూర లాంటి ఆకుకూరలు పండుతున్నాయని, దానిమ్మ, సపోటా, జామ, బొప్పాయి, ద్రాక్ష, డ్రాగన్ ఫ్రూట్ వగైరా, ఆపిల్ ఇలా చాలారకాల ఫ్రూట్స్ పండిస్తున్నామని చెప్పారు. వీటితోపాటు మధుమేహం, కిడ్నీలో రాళ్ళు లాంటి ఎన్నో వ్యాధులకు ఉపయోగపడే రణపాల, తెల్లగజ్జర లాంటి ఔషద మొక్కలను పెంచుతున్నామని, వీటికి రసాయన ఎరువులు కాకుండా తమ ఇంట్లోని బెల్లం, ఆవుపేడ, బియ్యం నీళ్లు, పిండి పదార్థాలు, కుళ్లిన కూరగాయలు, పండ్ల తొక్కల లాంటి వ్యర్థ పదార్థాలను కంపోస్టు చేసి సేంద్రియ ఎరువులుగా వాడుతున్నామని వివరించారు. దాంతో రోజుకి కిలో నిండి రెండు కిలోల వరకు నాణ్యమైన తాజా ఆకుకూరలు, కూరగాయలు వస్తున్నాయని మిద్దె తోటల ద్వారా.. వీటిని నిత్య ఆహారంలో, వంటలకు ఉపయోగించడంతో సంపూర్ణ ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగిస్తున్నామని, రుచికరమైన వెజిటేబుల్స్ కూర సిద్ధమవుతుందని చెబుతున్నారు. చాలామంది మిద్దె తోటలు ఏర్పాటు చేసుకోవాలంటే చాల ఖర్చుతో కూడుకున్నదన్న అపోహలో ఉంటారని, మన ఇంట్లోనే వృధాగా ఉన్న వస్తువులతో పెద్దగా ఖర్చు లేకుండానే సేద్యం చేసుకోవచ్చునని బుర్ర రాధ వివరించారు. కూరగాయల మొక్కల మధ్య సుగంధ ఔషధ మొక్కలు పెంచితే మంచిదని, అన్నింటికీ ఒకే రకమైన సేంద్రియ ఎరువులు కాకుండా మొక్కలకు తగిన సేంద్రియ ఎరువు అందిస్తే మొక్కల ఎదుగుదల బాగుంటుందని, ఔషద మొక్కలు వాడటం వల్ల తన భర్త కిడ్నిలోని 12 మిల్లీమీటర్ల రాయి పూర్తిగా తనకి కరిగిపోయిందని, ఇప్పుడు ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని ఆనందం వ్యక్తం చేస్తూ..లోకల్18కి తెలిపారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పచ్చటి మొక్కల మధ్య తిరగడం మనసుకు ఉల్లాసాన్ని ఆహ్లాదాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తుందని, ఇలాగే మహిళలందరూ మిద్దెతోటలపై మొగ్గు చూపాలని, దాంతో ఎలాంటి రోగాలు దరిచేరవని, నాణ్యమైన తాజా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ సాగు చేసుకోవచ్చని చెప్తున్నారు. మనకున్న ఆసక్తికి కాస్త సృజనాత్మకతను జోడిస్తే మిద్దెతోటల పెంపకానికి ఎలాంటి ఇబ్బంది ఖర్చు ఉండదని చెప్తున్నారు. తోటలను పెంచడం హాబీగా మార్చుకోవాలని, మొక్కలను పెంచడంతోపాటు వాటితో అనుబంధాన్ని పెంచుకోవాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
2024-07-07T13:56:42Z
ఈ వాసనలకు పాములు సుస్సు పోసుకుంటాయి.. నాగలోకంలో ఉన్నా అవి మీ దగ్గరకు రావు..!
ఎండవేడిమి నుండి ఉపశమనం కోసం ప్రజలు వర్షాకాలాన్ని చాలా ఇష్టపడతారు. అయితే, ఈ సీజన్ ఉపశమనంతో పాటు అనేక సమస్యలను కూడా తెస్తుంది. దీనివల్ల నీటి వల్ల వచ్చే వ్యాధులు, ఫుడ్ పాయిజనింగ్, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉండటమే కాకుండా.. పాములు, తేళ్లు, జర్రిలు మొదలైన కొన్ని చాలా ప్రమాదకరమైన జీవులు ఇంట్లోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గ్రామాలు, కొండ ప్రాంతాలు లేదా అటవీ ప్రాంతాలు మరియు గ్రౌండ్ ఫ్లోర్లో నివసించే వారు ఎంతో ప్రమాదంలో ఉన్నట్టే. అటువంటి పరిస్థితిలో ప్రమాదాన్ని నివారించడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి. వర్షాకాలంలో పాములు, కీటకాలను ఇంటి నుండి దూరంగా ఉంచడానికి 10 మార్గాలను తెలుసుకుందాం. ముఖ్యంగా మీరు గ్రౌండ్ ఫ్లోర్లో నివసిస్తుంటే, మీ ఇల్లు కొండ ప్రాంతంలో లేదా అడవి, పార్క్ మొదలైన వాటికి సమీపంలో ఉంటే.. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షం పడితే తలుపులు, కిటికీలు మూసేయాలి. ఎందుకంటే పాములు ఈ ప్రదేశాల్లో ఎక్కవ సంచరిస్తుంటాయి. పాములంటే ప్రజల్లో భయం నెలకొంది. అందరూ పాములకు దూరంగా ఉండాలని కోరుకుంటారు, అయితే పాములను సురక్షితంగా తరిమివేయడం ఎలా.. పాములను పారిపోయేలా చేసే వాసన ఈ ప్రపంచంలో ఏదైనా ఉందా అంటే సమాధానం అవుననే వస్తుంది. పాములను తరిమిమీరు వేప నూనెను ఉపయోగించవచ్చు. వేపనూనెను నీళ్లలో కలిపి రోజూ ఇంటింటా స్ప్రే చేస్తే దోమదోషాలు తొలగిపోతాయి. ఇంటి తోటలో కూడా ఈ నీటిని పిచికారీ చేస్తూ ఉండండి. పాములను లేదా ఇతర జంతువులను మీ ఇంటికి దూరంగా ఉంచడానికి బ్లీచింగ్ పౌడర్ని ఉపయోగించవచ్చు. బయట మరియు తోటలో నిలబడి ఉన్న నీటిపై పిచికారీ చేయండి. ఈ నీటితో ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు. కావాలంటే దాల్చిన చెక్క పొడి, వైట్ వెనిగర్ లేదా నిమ్మరసం కలిపి ఇంటి బయట పిచికారీ చేసుకోవచ్చు. పాములు వచ్చే అవకాశం ఉన్న ప్రదేశాలలో క్రమం తప్పకుండా పిచికారీ చేయాలి. పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే కిటికీలకు, తలుపులకు ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలను రాయండి. చాలా పాములు ఈవాసన చూసి పారిపోతుంటాయి. మీ ఇంటి తోటలో వెల్లుల్లి మరియు ఉల్లిపాయలను నాటడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. పాములు కొన్ని మొక్కలకు కూడా భయపడతాయి, అవి పారిపోతాయి. కాక్టస్, స్నేక్ ప్లాంట్, తులసి చెట్టు, నిమ్మ గడ్డి మొదలైనవి వర్షాకాలంలో తప్పనిసరిగా నాటాలి. ఇంటి ప్రధాన ద్వారం, కిటికీల దగ్గర ఈ మొక్కలను ఉంచాలి. ఈ మొక్కల వాసన కారణంగా, పాములు ఇంటి దగ్గరికి రావు. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది.. న్యూస్ 18 తెలుగు దీనిని ధృవీకరించడం లేదు.)
2024-07-07T07:55:36Z