రాజన్న సిరిసిల్ల : ప్రేమ వ్యవహారంలో(Love affair) ఓ యువకుడు పురుగుల మందు(Pesticide) తాగి ఆత్మహత్య(Young man Suicide) చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన శ్రీనాథ్(24) గ్రామంలో ఓ యువతిని ప్రేమించాడు. ఈ విషయం బంధువులకు తెలియడంతో యువతి అన్నతోపాటు అతడి స్నేహితులు శ్రీనాథ్ను కొట్టారు. దీంతో మనస్తాపం చెందిన శ్రీనాథ్ ఈ నెల 10న ముస్తాబాద్ మండలం బంధనకల్ గ్రామ శివారున పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కుటుంబ సభ్యులు చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ దవాఖానకు తీసుకెళ్లగా, అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 13న మృతి చెందాడు. ఆదివారం స్వగ్రామానికి శ్రీనాథ్ మృతదేహం చేరవడంతో రోడ్డుపై బంధువులు ధర్నా చేశారు. శ్రీనాథ్ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న వెంటనే డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, సీఐలు శ్రీనివాస్గౌడ్, మొగిలి ఘటన స్థలానికి చేరుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంత వారు ధర్నా విరమించారు. శ్రీనాథ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు.
2024-07-14T15:14:05Z dg43tfdfdgfd