పుల్లటి పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదేనా..?

ఇండియన్స్ కి భోజనంలో కచ్చితంగా ఉండాల్సింది పెరుగు. ఎన్ని రకాల వంటలు ముందు పెట్టినా.. చివరలో పెరుగుతో తినకపోతే.. ఆ భోజనం పూర్తైన అనుభూతి కలగదు.  ఒకవేళ పెరుగు తినకపోయినా మజ్జిగ, లస్సీ రూపంలో తీసుకుంటూ ఉంటాం.  ఎందుకంటే.. పెరుగు మన గట్ హెల్త్ కి చాలా మంచిది.  మనకు వేడి చేయకుండా.. కడుపు చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది. మన ఆరోగ్యానికి పెరుగు చాలా అవసరం కూడా..

కానీ.. పెరుగు తియ్యగా ఉన్నప్పుడు మాత్రమే తినగలం. కాస్త పులుపు ఎక్కినా తినలేం. కొందరైతే పుల్లగా మారిన పెరుగును పారేయలేక.. ఏదో ఒక విధంగా తినేస్తూ ఉంటారు. కొందరేమో.. పుల్లటి పెరుగు తింటే.. గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయని నమ్ముతారు. ఏది నిజం..?  పులియబెట్టిన పెరుగు తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి..? అసలు పుల్లటి పెరుగు తినడం మంచిదేనా..? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం...

పెరుగు పుల్లగా మారింది అంటే దాని రుచి, ఆకృతి నాశనం చేస్తుంది.  పుల్లటి పెరుగు అందరి హెల్త్ కి సెట్ కాదు. అలా కాకుండా.. పుల్లటి పెరుగు తినాలి అంటే.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే.. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

 పుల్లని పెరుగును శీతలీకరించి, గాలి చొరబడని, శుభ్రమైన కంటైనర్‌లో ఉంచాలి. పెరుగును సరిగ్గా నిల్వ చేయనప్పుడు, ప్రమాదకరమైన సూక్ష్మక్రిములు వృద్ధి చెందుతాయి. తినడానికి అనారోగ్యకరంగా మారుతాయి.

లాక్టోస్, లేదా పాల చక్కెర, లాక్టిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేయడానికి బ్యాక్టీరియా ద్వారా పులియబెడతారు, ఇది పెరుగును పుల్లగా చేస్తుంది. ఈ సహజ ప్రక్రియ ద్వారా పెరుగు ఎక్కువ కాలం పులియబెట్టడానికి అనుమతిస్తారు. కిణ్వ ప్రక్రియ ఎంత సమయం పడుతుంది. ఏ పరిస్థితులలో ఆధారపడి ఉంటుంది అనేదానిపై ఆధారపడి, పుల్లని రుచి కొద్దిగా చిక్కగా ఉండటం నుండి చాలా పుల్లగా ఉంటుంది.

 కిణ్వ ప్రక్రియ ప్రక్రియను మందగించడానికి అంటే.. ఎక్కువ పులిసి పోకుండా.. చెడిపోకుండా ఉండటానికి, పెరుగును ఎల్లప్పుడూ స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి. పెరుగును ఉంచే పాత్రలను  కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి.   కలుషితాలను ప్రవేశపెట్టకుండా ఉండటానికి పెరుగును బయటకు తీయడానికి శుభ్రమైన పాత్రలను ఉపయోగించండి. 

అంతేకాదు.. పెరుగు పుల్లగా ఉంటే తినడానికి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి.. దీనిని  ఏదైనా పండ్లు, త్రుణ ధాన్యాలతో  కలిపి తీసుకోవచ్చు. ఇక.. పుల్లటి పెరుగును.. రాత్రిపూట అస్సలు తినకూడదు.  రాత్రిపూట తినడం వల్ల...కడుపులో ఇబ్బందిగా మారవచ్చు. కాబట్టి.. పగటి పూట మాత్రమే తినాలి.  ఇక.. పుల్లటి పెరుగు తినే సమయంలో.. కడుపులో ఏదైనా ఇబ్బందిగా, అసౌకర్యంగగా అనిపిస్తే... దానిని తినడం ఆపేయడమే మేలు.

2024-07-03T10:13:20Z dg43tfdfdgfd