తలలో పెన్ను గుచ్చుకుని నాలుగేండ్ల చిన్నారి దుర్మరణం
భద్రాచలం, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో తలలో పెన్ను గుచ్చుకుని నాలుగేండ్ల చిన్నారి చనిపోయింది. పట్టణంలోని సుభాష్నగర్ కాలనీకి చెందిన రియాన్షిక (4) యూకేజీ చదువుతోంది. సోమవారం మంచంపై పడుకుని పెన్నుతో ఆడుకుంటోంది. అకస్మాత్తుగా బెడ్పై నుంచి కింద పడడంతో చేతిలోని పెన్ను చెవి పైభాగంలో ని కణతలో గుచ్చుకుని అలాగే ఉండిపోయింది. తల్లిదండ్రులు వెంటనే దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఖమ్మం తరలించగా ఓ ప్రైవేటు దవాఖానలో ఆపరేషన్ చేసి పెన్ను తీశారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కన్నుమూసింది.
©️ VIL Media Pvt Ltd. 2024-07-04T02:07:09Z dg43tfdfdgfd